కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత చేపట్టిన డీఎస్సీ నియామకాల్లో తప్పులు జరగకుంటే భయమెందుకు. రాష్ట్రంలో జెన్జీ యువత సత్తా చూడలనుకుంటే ప్రభుత్వానికి పతనం తప్పదు. యువత, విద్యార్థులు తలచుకుంటే ప్రభుత్వాలు దిగిరాక తప్పదని ఢిల్లీ ఘటన చూసి తెలుసుకోండి. 2025 డీఎస్సీ నియామకాల మెరిట్ లిస్ట్ ప్రకటించడంలో విద్యాశాఖమంత్రికి ఎందుకుంత భయం. నియామకాల్లో అవకతవకలు జరగలేదని ఎందుకు శ్వేతపత్రం విడుదల చేయడం లేదు. ఇందుకు బాధ్యత వహించాల్సిన నారా లోకేష్.. యువతకు చేస్తున్న అన్యాయంపై బహిరంగ చర్చకు రావాలి. సామాన్యకార్యకర్తలైన మేమే గద్దె దింపుతాం.
– కోలగట్ల శ్రావణి,
వైఎస్సార్సీపీ రాష్ట్ర మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి,
విజయనగరం


