–8లో
17 ఏళ్లకే ఓటరుగా నమోదు..!
ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ప్రక్రియను పూర్తిచేసిన కేంద్ర ఎన్నికల సంఘం అందులో భాగంగా 17 ఏళ్లకే కొత్త ఓటరుగా నమోదు ప్రక్రియను ప్రారంభించింది.
ఎన్నికలకు ముందు యువత, విద్యార్థుల జీవితాల్లో ఆశలు కల్పించారు. ఎన్నికల్లో లబ్ధిపొందాక హామీలు అమలు చేయకుండా మోసం చేస్తున్నారు. యువత, విద్యార్థుల సమస్యలు పరిష్కారమయ్యేంత వరకు వైఎస్సార్సీపీ తరఫున పోరాటం చేస్తాం. నీట్ పరీక్ష పేపర్ లీకేజీ విషయంలో యువత, విద్యార్థులు చేపట్టిన పోరాటంతో కేంద్రం దిగివచ్చింది. నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేశారు. రాష్ట్రంలో గతేడాది చేపట్టిన డీఎస్సీ నియామకాల్లో జరిగిన అవకతవకలపై ప్రభుత్వం, విద్యాశాఖ మంత్రి ఎందుకు నోరు విప్పడం లేదు. ఉత్తీర్ణులు కాని వారికి స్పోర్ట్స్ కోటా పేరిట డబ్బులు వసూలు చేసి ఉద్యోగాలు కట్టబెట్టారు. దీనివల్ల అర్హులకు అన్యాయం జరిగింది. తక్షణమే సీబీఐ విచారణ జరిపించాలి. అప్పటి వరకు విద్యాశాఖ మంత్రి తన పదవికి రాజీనామా చేయాలి. ఎన్నికలకు ముందు నిరుద్యోగ యువతకు ఇచ్చిన హమీ మేరకు నెలకు రూ.3వేల భృతి ఇవ్వాలి.
– మజ్జి శ్రీనివాసరావు, జెడ్పీ చైర్మన్,
వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు


