స్కూల్‌ వ్యాన్‌ను ఢీకొన్న ఇసుక ట్రాక్టర్‌ | - | Sakshi
Sakshi News home page

స్కూల్‌ వ్యాన్‌ను ఢీకొన్న ఇసుక ట్రాక్టర్‌

Jul 23 2026 6:54 AM | Updated on Jul 23 2026 6:54 AM

నలుగురు విద్యార్థులకు గాయాలు

ఇద్దరిని తాండూరు ఆస్పత్రికి తరలింపు

బొంరాస్‌పేట: స్కూల్‌ వ్యాన్‌ను ఇసుక ట్రాక్టర్‌ ఢీ కొనడంతో నలుగురు విద్యార్థులు గాయపడ్డారు. ఈ ఘటన బుధవారం మండలంలోని మహంతీపూర్‌లో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన 11 మంది విద్యార్థులు కొడంగల్‌లోని శ్రీ గాయత్రి పాఠశాలలో చదువుతున్నారు. ఉదయం పాఠశాలకు వెళ్లిన విద్యార్థులు సాయంత్రం వ్యాన్‌లో ఊరికి బయలుదేరారు. ఈ క్రమంలో మహంతీపూర్‌ చెందిన అచ్చమోళ్ల రాములు గ్రామ సమీపంలోని వాగు నుంచి ట్రాక్టర్‌లో ఇసుక తరలిస్తున్నారు. కొత్తూరు శివారులో డంపు చేసేందుకు వెళ్తుండగా మిషన్‌ భగీరథ వాటర్‌ ట్యాంకు వద్ద ఎదురుగా వస్తున్న వ్యాన్‌ ఢీ కొట్టాడు. ఈ ప్రమాదంలో వ్యానులోని చందన(నాలుగో తరగతి) తలకు, యశశ్విని(మూడో తరగతి) కాలికి, మోక్ష(ఆరో తరగతి), నికిల్‌ (రెండో తరగతి)కు గాయాలయ్యాయి. మెరుగైన వైద్యం కోసం మోక్ష, నికిల్‌ను తాండూరులోని ఆస్పత్రికి తరలించారు. ట్రాక్టర్‌ను పోలీసు స్టేషనుకు తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement