ఏర్పేడు: మండలంలోని మడిబాక అరుంధతీవాడకు చెందిన మోటుపల్లి కృష్ణయ్య(47) అనే వ్యవసాయ కూలీ శనివారం వడదెబ్బకు గురై మృతి చెందినట్లు మృతుని కుటుంబసభ్యులు తెలిపారు. వివరాల్లోకి వెళితే.. మడిబాక అరుంధతీవాడకు చెందిన కృష్ణయ్య శనివారం గ్రామంలోని ఓ రైతు పొలంలో కూలి పనులకు వెళ్లాడు. మధ్యాహ్నం ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడంతో అక్కడ నుంచి ఇంటికి చేరుకోగానే నీరసించి కళ్లు తిరిగి కుప్పకూలిపోయాడు. కుటుంబసభ్యులు అతన్ని చికిత్స నిమిత్తం తిరుపతిలో ఆస్పత్రికి తీసుకెళుతుండగా మార్గం మధ్యలోనే మృతి చెందాడు.


