రైల్వే అండర్‌ బ్రిడ్జి పనులు పూర్తి | - | Sakshi
Sakshi News home page

రైల్వే అండర్‌ బ్రిడ్జి పనులు పూర్తి

May 15 2026 12:49 PM | Updated on May 15 2026 12:49 PM

● యథావిధిగా వాహనాల రాకపోకలు

రేణిగుంట: పట్టణంలోని రైల్వే అండర్‌ బ్రిడ్జ్‌ మరమ్మతు పనులు పూర్తి అయ్యాయి. దీంతో బుధవారం మధ్యాహ్నం రైల్వే అండర్‌ బ్రిడ్జి మీదుగా వాహనాల రాకపోకలను రేణిగుంట తహసీల్దార్‌ శ్యామ్‌ ప్రసాద్‌, ఎంపీడీఓ రవిచంద్ర, రైల్వే అధికారులు, పట్టణ సీఐ జయచంద్ర ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ రవిచంద్ర మాట్లాడుతూ సకాలంలో రైల్వే అండర్‌ బ్రిడ్జిని పూర్తి చేసినందుకు రైల్వే అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. అండర్‌ బ్రిడ్జ్‌ అనుకున్న విధంగా సకాలంలో పూర్తి చేసినందుకు అధికారులను స్థానిక టీడీపీ నాయకులు ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో టీడీపీ రేణిగుంట మండల అధ్యక్షుడు మునిచంద్రారెడ్డి, పట్టణ అధ్యక్షుడు మహబూబ్‌ బాషా, క్లస్టర్‌ ఇన్‌చార్జి పుష్పనాథన్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement