జిల్లా వ్యాప్తంగా పదోతరగతి పరీక్షలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అన్ని చర్యలు చేపట్టాం. పరీక్ష కేంద్రాలలో విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేయించాం. పరీక్ష అంటే భయం లేకుండా, ఒత్తిడికి లోను కాకుండా పిల్లలు చక్కగా రాయాలి. ఆల్ ది బెస్ట్ మై డియర్ చిల్ట్రన్స్.
– వెంకటేశ్వర్, కలెక్టర్, తిరుపతి
సర్వం సిద్ధం
జిల్లాలోని పరీక్ష కేంద్రాలలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. తల్లిదండ్రులు తమ పిల్లలను గంట ముందుగానే కేంద్రాలకు తీసుకువచ్చేందుకు యత్నించాలి. ఆయా సెంటర్లలో ఎవరికై నా సమస్యలు ఎదురైతే తక్షణం కంట్రోల్ రూమ్ నంబర్కు ఫిర్యాదు చేయాలి. మాస్ కాపీయింగ్, మాల్ ప్రాక్టీస్కు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు.
– కేవీఎన్ కుమార్, డీఈఓ, తిరుపతి


