గత ప్రభుత్వం వలంటీర్ల వ్యవస్థను ఏర్పాటు చేసి ప్రతి సంక్షేమ పథకాన్ని ఇంటి వద్దకే అందేలా చేసింది. ప్రజలకు అవసరమైన ప్రతి ధ్రువీకరణ పత్రాన్ని జగనన్న సురక్ష పేరుతో నేరుగా ఇంటి వద్దకే అందించింది. రేషన్ కూడా ఎండీయూ వాహనాలతో ఇంటి వద్దే పంపిణీ చేసింది.
ప్రస్తుతం సేవలు అందక నరకయాతన
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వలంటీర్ వ్యవస్థ ను నిలిపివేయడంతో పింఛన్ లబ్ధిదారులు నరకయాతన పడుతున్నారు. ధ్రువీకరణ పత్రాల కోసం, రెవెన్యూ సమస్యలు, ఇతర ప్రభు త్వ సేవల కోసం ప్రజలు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు.


