నేడు మహతిలో పౌరాణిక, సాంఘిక నాటికల ప్రదర్శన | - | Sakshi
Sakshi News home page

నేడు మహతిలో పౌరాణిక, సాంఘిక నాటికల ప్రదర్శన

Aug 9 2025 8:40 AM | Updated on Aug 9 2025 8:40 AM

నేడు మహతిలో పౌరాణిక, సాంఘిక నాటికల ప్రదర్శన

నేడు మహతిలో పౌరాణిక, సాంఘిక నాటికల ప్రదర్శన

తిరుపతి కల్చరల్‌: మహతి కళాక్షేత్రంలో శనివారం పౌరాణిక, సాంఘిక నాటికల ప్రదర్శనలకు కళాకారులు, కళాభిమానులు, ప్రజలు హాజరై వీక్షించాలని సుబ్బరాజు నాట్య కళా పరిషత్‌ అధ్యక్షుడు కోనేటి సుబ్బరాజు పిలుపునిచ్చారు. ప్రకాశం రోడ్డులోని ఆ సంస్థ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రస్తుతం నాటక తరంగానికి పూర్వవైభవం తేవాలనే సంకల్పంతో అధునాతన హంగులతో కూడిన సెట్టింగ్స్‌తో నాటకాలను గ్రామీణ ప్రాంతాల్లో ప్రదర్శిస్తున్నామన్నారు. ఈ నేపథ్యంలో మహతిలో శనివారం సాయంత్రం 4.30 గంటలకు ‘అహో..ఆంధ్రభోజ’ పద్య నాటకం, రాత్రి 8 గంటలకు విశాఖ భద్రం ఫౌండేషన్‌ సమర్పణలో ‘ దొందూ... దొందే’ సాంఘిక నాటిక ప్రదర్శించనున్నట్టు తెలియజేశారు. సమావేశంలో పరిషత్‌ ఉపాధ్యక్షులు ఆమూరి సుబ్రమణ్యం, కె.రాధాకృష్ణ, సంయుక్త కార్యదర్శులు చంద్రబాబు, మేకల గంగయ్య, కోశాధికారి బి.గోపాల్‌, హారిక, కేశవులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement