
● టోల్ గేట్ పేరుతో బస్సుల్లో అదనపు వసూలు ● తిరుపతి–శ్
తిరుపతి అర్బన్ : జిల్లాలో తిరుమల తర్వాత ప్రముఖ పుణ్యక్షేత్రంగా పేరొందిన శ్రీకాళహస్తి దేవస్థానానికి నిత్యం భక్తుల రద్దీ ఉంటుంది. తిరుపతికి వచ్చే భక్తులు తిరుమల, తిరుచానూరు దర్శనం అనంతరం శ్రీకాళహస్తికి వెళుతుంటారు. అయితే ఆర్టీసీ అధికారులు తిరుపతి నుంచి శ్రీకాళహస్తికి వెళ్లే సర్వీసుల్లో చార్జీలు పెద్ద ఎత్తున పెంచేశారు. దీంతో పలువురు ప్రయాణికులు మండిపడుతున్నారు.
తిరుపతి–శ్రీకాళహస్తి మార్గంలోని ఏర్పేడు సమీపం మేర్లపాక వద్ద ఇటీవల టోల్గేట్ను అందుబాటులోకి తీసుకొచ్చారు. దీంతో ఈ మార్గంలో నడుస్తున్న ఆర్టీసీ చార్జీలను టిక్కెట్ ధరపై ఏకంగా రూ.10 పెంచేశారు. దీంతో ప్రయాణికులు లబోదిబోమంటున్నారు. ఆర్టీసీ టోల్గేట్ చెల్లించే దాని కంటే రెట్టింపు ధరలు చార్జీల ద్వారా గుంజేస్తున్నారని పలువురు ప్రయాణికులు ఆవేదన చెందుతున్నారు.
ఆర్టీసీ టోల్గేట్లో
రూ. 705 చెల్లించాల్సి ఉంది.
తిరుపతి నుంచి ఓ ఆర్టీసీ సర్వీసు శ్రీకాళహస్తికి వెళ్లడానికి రూ.470, తిరిగి రావడానికి రూ.235 చెల్లించాలి. మొత్తంగా రూ.705 టోల్గేట్లో ఒక ఆర్టీసీ సర్వీస్ చెల్లించాల్సి ఉంది. అయితే ఆర్టీసీ సర్వీసులో 46 సీట్లు ఉన్నాయి. ఒక టిక్కెట్పై రూ.10 పెంచారు. దీంతో ఒక ట్రిప్పునకు రూ.460 ఆర్టీసీకి వస్తుంది. మరో ట్రిప్పునకు రూ.460 వస్తుంది. మొత్తంగా రెండు ట్రిప్పులకు రూ.920 వస్తుంది. అయితే రెండు ట్రిప్పులకు ఆర్టీసీ టోల్గేట్లో చెల్లించేది రూ.705 మాత్రమే. ఈ క్రమంలో ఆర్టీసీకి అదనంగా రూ. 215 మిగులుతుంది. టోల్గేట్ ఏర్పాటు చేస్తే ఆ చార్జీలను ప్రభుత్వమే భరించాల్సి ఉంటుంది. అలా కాకుండా కూటమి సర్కార్లో ప్రయాణికులపై అదనపు భారాన్ని చార్జీలు పెంచి వసూళ్లు చేయడంపై పలువురు మండిపడుతున్నారు.
శ్రీకాళహస్తి డిపో నుంచి 8 మెట్రో సర్వీసులు విశాఖకు తరలింపు
తిరుపతి–శ్రీకాళహస్తి మార్గంలో ప్రయాణికులకు సౌకర్యంగా ఉండడం కోసం గాలి, వెలుతురు వచ్చేలా ఉండే మెట్రో సర్వీస్లను గతంలో 32 ఏర్పాటు చేశారు. అయితే వాటిలో 8 సర్వీసులు మరమ్మతుకు గురికావడంతో 24 సర్వీసులు తిరుగుతుండేవి. వాటిలో తిరుపతి నుంచి శ్రీకాళహస్తికి చార్జీ రూ.55 మాత్రమే. అయితే మూడు నెలల కిందట మెట్రో సర్వీస్లు విశాఖపట్నంలో టౌన్ సర్వీస్లకు అనుకూలంగా ఉంటాయని శ్రీకాళహస్తి డిపో నుంచి విశాాఖపట్నానికి పంపించారు. వాటి స్థానంలో 8 అల్ట్రా డీలక్స్ సర్వీస్లను ఏర్పాటు చేశారు. మెట్రో సర్వీస్లో టిక్కెట్ ధర రూ.55 ఉంటే...అల్ట్రా డీలక్స్లో టిక్కెట్ ధర రూ.70 చేశారు. దీంతో ప్రయాణికులు తమకు మెట్రో సర్వీసులు ఎంతో అనుకూలంగా ఉండేవని....వాటి స్థానంలో అల్ట్రా డీలక్స్లను ఏర్పాటు చేసి...టిక్కెట్పై రూ.15 పెంచడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. అయినా అర్టీసీ వాటిని పట్టించుకోకుండా చార్జీలను అలానే కొనసాగిస్తోంది. తాజాగా అల్ట్రాడీలక్స్లో టోల్గేట్ పేరుతో రూ.5 పెంచారు. మొత్తంగా తిరుపతి నుంచి శ్రీకాళహస్తికి అల్ట్రా డీలక్స్లో వెళ్లాలంటే టిక్కెట్ ధర రూ.75 చెల్లించాల్సి ఉంటుంది.
శ్రీకాళహస్తి నుంచి తిరుపతికి మేర్లపాక టోల్గేట్ వద్ద వస్తున్న మెట్రో సర్వీస్
టోల్గేట్లో తిరుపతి–శ్రీకాళహస్తి మార్గంలో పెంచిన చార్జీలు
సర్వీస్ పాత కొత్తగా
చార్జీలు చార్జీలు
(రూ.లలో)
మెట్రోసర్వీస్ 55 65
ఎక్స్ప్రెస్ 55 65
పల్లెవెలుగు 45 55
ఆర్డినరీ సర్వీస్లు 45 55
అల్ట్రాడీలక్స్ 70 75
నష్టం వస్తుందని..
తిరుపతి–శ్రీకాళహస్తి మార్గంలో తిరుగుతున్న సర్వీస్ల్లో టిక్కెట్ ధరపై రూ.10 పెంచాం. అయితే అల్ట్రా డీలక్స్ మాత్రం టిక్కెట్ ధరపై రూ. 5 పెంచాం. ఒక సర్వీస్ శ్రీకాళహస్తి నుంచి తిరుపతికి వెళ్లి రావడానికి రూ.705 టోల్గేట్ కట్టాల్సి ఉంది. ఒక సర్వీస్లో 45 లేదా 46 సీట్లు ఉంటే రెండు ట్రిప్పులకు టిక్కెట్ ధర పెంచడం ద్వారా రూ.900 నుంచి 920 వస్తుంది. అయితే అన్ని సీట్లు...అన్ని ట్రిప్పులు భర్తీ కావడం లేదు. ఈ క్రమంలోనే టిక్కెట్ ధర రూ.10 చేయాల్సి వచ్చింది. టిక్కెట్పై రూ.10 పెంచకపోతే ఆర్టీసీకి నష్టం వస్తుంది.
– మునిచంద్ర, శ్రీకాళహస్తి ఆర్టీసీ డిపో మేనేజర్

● టోల్ గేట్ పేరుతో బస్సుల్లో అదనపు వసూలు ● తిరుపతి–శ్