
తల్లీ.. కూటమికి కనువిప్పు కలిగించు!
● రాహుకాల పూజల్లో చెవిరెడ్డి లక్ష్మి
తిరుపతి రూరల్ : ‘అమ్మా.. చాముండేశ్వరీ.. కుట్రలు, కుతంత్రాలు, కక్షలతో కళ్లు మూసుకుని పరిపాలన చేస్తున్న కూటమి ప్రభుత్వానికి కనువిప్పు కలిగించు తల్లీ.. నీ బిడ్డ చెవిరెడ్డిని రాజకీయ కక్షతో అక్రమంగా కేసులు పెట్టి జైలుకు పంపారు.. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయనకు మనోధైర్యం కలిగించు.. తల్లీ..’ అంటూ వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చెవిరెడ్డి భాస్కర్రెడ్డి సతీమణి చెవిరెడ్డి లక్ష్మి అమ్మవారిని వేడుకున్నారు. తిరుపతి రూరల్ మండలం, తుమ్మలగుంటలోని శ్రీ శక్తి చాముండేశ్వరి అమ్మవారి ఆలయంలో ప్రతి శుక్రవారం నిర్వహించే రాహుకాల పూజల్లో చెవిరెడ్డి లక్ష్మి పాల్గొన్నారు. ఆమె చేత అమ్మవారికి శాంతి పూజలు, హోమం నిర్వహించారు. పూజా కార్యక్రమాల్లో తుమ్మలగుంటకు చెందిన మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.