కడుపు మండి.. రోడ్డుపై పోసి | - | Sakshi
Sakshi News home page

కడుపు మండి.. రోడ్డుపై పోసి

Jun 21 2025 2:53 AM | Updated on Jun 21 2025 2:53 AM

కడుపు మండి.. రోడ్డుపై పోసి

కడుపు మండి.. రోడ్డుపై పోసి

పాకాల : రోజురోజుకి మామిడి రైతులు కన్నీటి వ్యధ అధికమవుతోంది. మామిడికి గిట్టుబాటు ధర హామీ నెరవేరక పోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. కూటమి నాయకులు ఇచ్చిన హామీలు నీటిపై రాసిన రాతలుగా మారడంతో రైతులు విస్తుపోతున్నారు. కేవలం రూ.3లకు కొనుగోలు చేస్తూ ర్యాంపు నిర్వాహకులు, సప్లయర్లు రైతులను దగా చేస్తున్నారు. శుక్రవారం కొన్ని ర్యాంపులను తెరిపించి రైతుల వద్ద మామిడిని కొనుగోలు చేయడానికి టోకెన్లను ఇప్పించారు. కార్యక్రమంలో డీఎస్పీ ప్రసాద్‌, ఆర్డీఓ రామ్మోహన్‌, డీహెచ్‌ఓ దశరథరామిరెడ్డి, సీఐ సుదర్శన్‌ప్రసాద్‌, ఉద్యానశాఖ అధికారిణి శైలజ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement