డ్వాక్రాలో తమ్ముళ్ల పెత్తనం | - | Sakshi
Sakshi News home page

డ్వాక్రాలో తమ్ముళ్ల పెత్తనం

Jun 22 2025 3:14 AM | Updated on Jun 22 2025 3:14 AM

డ్వాక

డ్వాక్రాలో తమ్ముళ్ల పెత్తనం

పాకాల : డ్వాక్రా గ్రూపులో పది మంది సభ్యులు ఉన్నా మరోక సభ్యురాలిని చేర్చుకోవాలని స్థానిక టీడీపీ నేత ఓ సంఘంపై కొద్ది రోజులుగా ఒత్తిడి చేస్తున్నారు. సంఘంలోని సభ్యులు దానికి ఒప్పుకోకపోవడంతో ఆ సంఘానికి రుణాలు రాకుండా ఆ టీడీపీ నేత అడ్డుపడ్డాడు. దీంతో విసిగిపోయిన ఆ మహిళా సంఘం సభ్యులు శనివారం తమ ఊరిలోని రోడ్డుపైనే నిరసనకు దిగారు. అనంతరం వెలుగు కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగి న్యాయం చేయాలని అధికారులను వేడుకున్నారు. అర్హత ఉన్నా రుణాలు రాకుండా అడ్డుకోవడంపై వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లా ఉన్నతాధికారులు జోక్యం చేసుకొని మహిళా సంఘానికి న్యాయం చేయాలని కోరుతున్నారు. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి..

మహిళల అభివృద్ధికి డ్వాక్రా సంఘాలు కీలకంగా వ్యవహరిస్తాయి. అలాంటి సంఘాల్లో టీడీపీ నాయకులు రాజకీయ చిచ్చు రేపి ప్రశాంతంగా ఉన్న గ్రామాల్లో గొడవలు రేపుతున్నారు. మండలంలోని మద్దినాయనపల్లి పంచాయతీ కొత్త ఒడ్డిపల్లిలో దుర్గా మహిళా మండల సంఘాన్ని స్థానిక మహిళలు 10 మంది గ్రూపుగా ఏర్పడి సంఘాన్ని నిర్వహిస్తున్నారు. అయితే అదే గ్రామానికి చెందిన ఓ కూటమి నేత తల్లి ఇదే గ్రూపులో ఉండడంతో కుటిల రాజకీయానికి తెర లేపారు. టీడీపీ నాయకుడు తల్లి ఉన్న గ్రూపులోనే తన భార్యను కూడా చేర్చాలని మరో టీడీపీ నేత వారిపై ఒత్తిడి తెచ్చాడు. గ్రూపు సభ్యులు మేము 10 మంది సరిపోయామని, 11 మంది తమ గ్రూపులో అవసరం లేదని చెప్పారు. దీంతో ఆగ్రహించిన ఆ కూటమి నేత మండల స్థాయి నాయకులతో కలసి గ్రూపు సభ్యులకు ఎలాంటి రుణాలు అందకుండా అడ్డుపడుతున్నాడు. నాయకుల చేతుల్లో కీలు బొమ్మలుగా వ్యవహరిస్తున్న వెలుగు అధికారులు గ్రూపు సభ్యులకు రుణాలు రానీయకుండా చేస్తున్నారని గ్రూపు సభ్యులు ఆరోపిస్తున్నారు. సుమారు 5 నెలలుగా ఇదే తంతు నడుస్తున్నా అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుండడం గమనార్హం. కొత్త ఒడ్డిపల్లి గ్రామానికి చెందిన కూటమి నాయకుడు ఎంత దూరమైనా వెళతానని, నా భార్యను చేర్చుకోకుంటే గ్రూపు ఎలా నడుస్తుందో చూస్తానని బెదిరిస్తూ గ్రూపు సభ్యులను భయబ్రాంతులకు గురి చేస్తున్నాడు.

రుణాలు రాకుండా కక్ష సాధింపు

మెజారిటీ గ్రూపు సభ్యుల మాటను లెక్క చేయని వైనం

టీడీపీ నాయకులకు అధికారుల సహకారం

రోడ్డుపై నిరసన తెలుపుతున్న గ్రూపు సభ్యులు

బెదిరింపులు ఇలా..

మండలంలోని కొంత మంది నాయకులు మహిళలు ఉండే కార్యాలయంలోనే తిష్ట వేసుకుని అధికారుల పనులకు ఆటంకం కలిగిస్తున్నారు. రాజకీయ చర్చ లు ప్రభుత్వ కార్యాలయాల్లోనే నిర్వహిస్తూ విసుగు పుట్టిస్తున్నారు. ముఖ్యంగా దుర్గా మహిళా మండలికి రుణాలు రానీయకుండా చేయడానికి వెలుగు అధికారులపై బెదిరింపులకు దిగినట్లు సమాచారం. మా కూటమి ప్రభుత్వంలో మేము చెబితే పనులు చెయ్య రా, మీకు ఎమ్మెల్యేనే చెప్పాలా..? మేము లీడర్లుగా కనిపించడం లేదా అంటూ తెగ బెదిరింపులు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. సుమారు 5 నెలలుగా డ్వాక్రా సంఘాల ద్వారా రావాల్సిన రుణాలు రాక గ్రూపు సభ్యులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇదే గ్రామంలో ఈ సమస్య పరిష్కారం కాకపోవడంతో మరో 4 గ్రూపులకు కూడా రుణాలు మంజూరు చేయకుండా పైశాచిక ఆనందాన్ని పొందుతున్నారు కూటమి నాయకులు. సంబంధిత జిల్లా స్థాయి అధికారులు జోక్యం చేసుకుని గ్రూపు సభ్యులకు న్యాయం చేయాలని మహిళలు కోరుతున్నారు.

డ్వాక్రాలో తమ్ముళ్ల పెత్తనం1
1/1

డ్వాక్రాలో తమ్ముళ్ల పెత్తనం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement