నవోదయ ఫలితాల్లో విశ్వం ప్రభంజనం | - | Sakshi
Sakshi News home page

నవోదయ ఫలితాల్లో విశ్వం ప్రభంజనం

Jun 21 2025 2:54 AM | Updated on Jun 21 2025 2:54 AM

నవోదయ

నవోదయ ఫలితాల్లో విశ్వం ప్రభంజనం

తిరుపతి ఎడ్యుకేషన్‌ : జవహర్‌ నవోదయ విద్యాలయాల్లో 2025–26 విద్యాసంవత్సరంలో ప్రవేశాలకు జాతీయ స్థాయిలో నిర్వహించిన 2వ జాబితా ప్రవేశ పరీక్ష ఫలితాల్లో తమ విద్యార్థులు అర్హత సాధించి ప్రభంజనం సృష్టించినట్లు తిరుపతిలోని విశ్వం విద్యాసంస్థ అధినేత డాక్టర్‌ ఎన్‌.విశ్వనాథరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఎస్‌.హృతిక్‌ రాయల్‌, సలాడీ భువనేష్‌, ఎం.నిహాంత్‌ కుమార్‌, డి.మహిదర్‌తో పాటు మొత్తం 54 మంది విద్యార్థులు నవోదయ విద్యాలయాల్లో సీట్లు సాధించారని తెలిపారు. గత 35 ఏళ్లుగా జాతీయ స్థాయిలో నిర్వహించే సైనిక్‌, నవోదయ, మిలిటరీ స్కూల్స్‌ తదితర పోటీ పరీక్షలకు ఉత్తమ ప్రమాణాలతో కూడిన అత్యుత్తమ శిక్షణ ఇస్తున్నట్టు తెలిపారు. దీంతో తమ విద్యార్థులు ఆయా విద్యాసంస్థల్లో ప్రవేశం సాధిస్తున్నట్లు పేర్కొన్నారు. విద్యార్థులను ఆ విద్యాసంస్థ అకడమిక్‌ డైరెక్టర్‌ ఎన్‌.విశ్వచందన్‌రెడ్డి, కరస్పాండెంట్‌ ఎన్‌.తులసీ విశ్వనాథ్‌ అభినందించారు. వచ్చే ఏడాదికి నిర్వహించే పోటీ పరీక్షలకు సంబంధించి దరఖాస్తు చేసుకోవడానికి 86888 88802, 93999 76999 నంబర్లలో సంప్రదించాలని కోరారు.

నవోదయ ఫలితాల్లో విశ్వం ప్రభంజనం 1
1/3

నవోదయ ఫలితాల్లో విశ్వం ప్రభంజనం

నవోదయ ఫలితాల్లో విశ్వం ప్రభంజనం 2
2/3

నవోదయ ఫలితాల్లో విశ్వం ప్రభంజనం

నవోదయ ఫలితాల్లో విశ్వం ప్రభంజనం 3
3/3

నవోదయ ఫలితాల్లో విశ్వం ప్రభంజనం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement