విషాద యాత్ర | - | Sakshi
Sakshi News home page

విషాద యాత్ర

Jun 21 2025 2:54 AM | Updated on Jun 21 2025 2:54 AM

విషాద

విషాద యాత్ర

● అదుపుతప్పి చెట్టును ఢీకొట్టిన కారు ● ఒకే కుటుంబంలో ఇద్దరి మృతి ● బాధితులది తిరుపతి జిల్లా

కొడవలూరు(శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా): కారు అదుపుతప్పి చెట్టును ఢీకొంది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఓ బాలిక, ఓ వృద్ధుడు మృతిచెందారు. ఐదుగురు గాయపడ్డారు. ఈ ఘటన మండలంలోని రాచర్లపాడు వద్ద శుక్రవారం జరిగింది. పోలీసుల కథనం మేరకు.. తిరుపతి జిల్లా భాకరాపేటకు చెందిన మహబూబ్‌బాషా కుటుంబం పదిమంది కారులో హైదరాబాద్‌ యాత్రకు వెళ్లింది. తిరిగి అదే కారులోనే సొంతూరికి బయలుదేరారు. కొడవలూరు మండలం రాచర్లపాడు సమీపంలో వస్తుండగా కారు అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న మస్తాన్‌ సాహెబ్‌ (67) అక్కడికక్కడే మృతిచెందాడు. ఆయేషా (11) అనే బాలిక తీవ్రంగా గాయపడి ఆస్పత్రికి తరలిస్తుండగా చనిపోయింది. కారు నడుపుతున్న మహబూబ్‌బాషాతోపాటు లోపల ఉన్న మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను హైవే మొబైల్‌ సిబ్బంది చొరవతో 108 అంబులెన్స్‌లో చికిత్స నిమిత్తం నెల్లూరు వైద్యశాలకు తరలించారు. గాయపడిన వారికి ప్రాణాపాయ పరిస్థితి లేదని వైద్యులు తెలిపినట్లు ఎస్సై కోటిరెడ్డి వెల్లడించారు. కారు నడుపుతున్న వ్యక్తి నిద్ర మత్తు కారణంగా అదుపుతప్పి ఉంటుందని ప్రాథమికంగా భావిస్తున్నామన్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

విషాద యాత్ర 1
1/2

విషాద యాత్ర

విషాద యాత్ర 2
2/2

విషాద యాత్ర

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement