
ఐజర్ ఇన్చార్జి రిజిస్ట్రార్గా కోహ్లీ
ఏర్పేడు : మండలంలోని జంగాలపల్లి సమీపంలో ఉన్న తిరుపతి ఐజర్ ఇన్చార్జి రిజిస్ట్రార్గా ఇంద్రప్రీత్సింగ్ కోహ్లీ నియమితులయ్యారు. విద్యామంత్రిత్వ శాఖ పరిధిలోని ఐజర్లో ప్రొఫెసర్గా పని చేస్తున్న ఆయనను ఇన్చార్జి రిజిస్ట్రార్గా నియమిస్తూ ఉత్తర్వులు విడుదల చేశారు. రాజమండ్రిలో పుట్టి పెరిగిన ఆయన అక్కడే పీజీ వరకు విద్యాభ్యాసాన్ని పూర్తి చేశారు. ఆయన న్యూఢిల్లీలోని ప్రతిష్టాత్మక సెంట్రల్ సెక్రటేరియట్ సర్వీసెస్లో పనిచేశారు. అయితే సొంత రాష్ట్రంలో సేవ చేయాలనే కాంక్షతో ఆయన స్వచ్ఛందంగా తన కేంద్ర ప్రభుత్వ పదవిని వదులుకుని తిరుపతి ఐజర్లో చేరారు. దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ విద్య, సాంకేతిక సంస్థల అనేక ఉన్నత స్థాయి కమిటీలలో రిసోర్స్ పర్సన్, నిపుణ సభ్యుడిగా పనిచేస్తున్నారు. ఇన్చార్జి రిజిస్ట్రార్గా అదనపు బాధ్యతలు స్వీకరించడంపై ఆయన సంతోషం వ్యక్తం చేశారు. ఐజర్ పాలనా చట్రాన్ని, సంస్థాగత నైపుణ్యాన్ని మరింత బలోపేతం చేసి, దేశంలోనే దీటైన ఐజర్గా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని ఆయన స్పష్టం చేశారు.