Water Heater: విద్యుత్‌ షాక్‌తో నర్సు మృతి | Woman dies of electric shock in Hyderabad | Sakshi
Sakshi News home page

Water Heater: విద్యుత్‌ షాక్‌తో నర్సు మృతి

Jul 28 2024 8:43 AM | Updated on Jul 28 2024 8:43 AM

Woman dies of electric shock in Hyderabad

ఖైరతాబాద్‌: గదిలో హీటర్‌ పెట్టుకునే క్రమంలో విద్యుత్‌ షాక్‌కు గురై యువతి మృతిచెందిన సంఘటన ఖైరతాబాద్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..కరీంనగర్‌కు చెందిన కె.సౌమ్య (20) ఖైరతాబాద్‌లో నివాసం ఉంటూ వాసవీ హాస్పిటల్‌లో నర్సుగా పనిచేస్తుంది. 

శుక్రవారం సాయంత్రం డ్యూటీకి వెళ్లాల్సి ఉండగా సౌమ్య స్నేహితుడు ప్రశాంత్‌ ఆమెకు ఫోన్‌చేసినా లిఫ్ట్‌ చేయకపోవడంతో అనుమానంతో రాత్రి 7.30గంటల ప్రాంతంలో గదికి వచ్చి తలుపు తట్టగా తీయలేదు. దీంతో స్థానికుల సాయంతో తలుపులు తెరిచి చూడగా గదిలో బాత్‌రూం పక్కనే సౌమ్య హీటర్‌ మీదపడి అచేతనంగా కని్పంచింది. వెంటనే హీటర్‌ స్విచ్‌ ఆఫ్‌ చేసి ఆమెను హాస్పిటల్‌కు తరలించగా డ్యూటీ డాక్టర్‌ పరిశీలించి అప్పటికే మృతిచెందినట్లు నిర్ధారించారు. 

గదిలో హీటర్‌ స్విచ్‌ఆన్‌ చేసి బకెట్‌లో వేసే క్రమంలో షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగా మృతిచెంది ఉండవచ్చని ప్రాథమికంగా నిర్ధారించారు. శరీరంపై హీటర్‌ వల్ల కాలిన గాయాలు ఉన్నాయి. ఈ మేరకు మృతురాలి తల్లి భాగ్యలక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement