సాక్షి, హైదరాబాద్: కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలంగాణ టూర్ షెడ్యూల్ ఖరారైంది. ఈ నెల 26న (ఆదివారం) ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆయన ఇక్కడకు వస్తున్న విషయం తెలిసిందే. కాగా చెన్నై నుంచి ప్రత్యేక విమానంలో ఆదివారం మధ్యాహ్నం 12.45 గంటలకు బేగంపేట ఎయిర్పోర్ట్కు చేరుకుంటారు. అక్కడి నుంచి హెలికాప్టర్లో మధ్యాహ్నం 1.45 నిమిషాలకు కరీంనగర్కు వెళతారు.
అక్కడికి దగ్గరలోని నగునూరు రోడ్డులో ఉన్నప్రతిమ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్కు చేరుకుని లంచ్ చేస్తారు. మధ్యాహ్నం 2.30 నుంచి 3.45 గంటల వరకు ప్రతిమ వైద్య కళాశాల రజతోత్సవ వేడుకల్లో పాల్గొంటారు. ఆ తర్వాత హె లికాప్టర్లో సాయంత్రం 4.55 నిమిషాలకు బేగంపేటకు చేరుకుని ఆ వెంటనే ప్రత్యేక విమానంలో ఢిల్లీకి తిరుగు ప్రయాణం అవుతారు.


