అజ్మీర్‌ దర్గాను సందర్శించిన ఎమ్మెల్సీ కవిత | TRS Leader Kalvakuntla Kavitha Visits Ajmer Sharif Dargah In Rajasthan | Sakshi
Sakshi News home page

అజ్మీర్‌ దర్గాను సందర్శించిన ఎమ్మెల్సీ కవిత

Oct 29 2022 2:00 AM | Updated on Oct 29 2022 2:00 AM

TRS Leader Kalvakuntla Kavitha Visits Ajmer Sharif Dargah In Rajasthan - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాజస్తాన్‌ పర్యటనలో భాగంగా శాసనమండలి సభ్యురాలు కల్వకుంట్ల కవిత శుక్రవారం అజ్మీర్‌ దర్గాను సందర్శించడంతో పాటు పలు దేవాలయాల్లో పూజలు చేశారు. అజ్మీర్‌లోని ఖ్వాజా మొహియుద్దీన్‌ చిస్తీ దర్గాను సందర్శించేందుకు వెళ్లిన కవితకు దర్గా పెద్దలు స్వాగతం పలికారు. ప్రత్యేక ప్రార్థన అనంతరం దర్గా పెద్దలతో కవిత భేటీ అయ్యారు.

మైనారిటీల సంక్షేమానికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ చేస్తున్న కృషిని దర్గా పెద్దలు కొనియాడటంతో పాటు తెలంగాణ లౌకికత్వానికి ప్రతీకగా నిలుస్తోందని వ్యాఖ్యానించారు. అజ్మీర్‌ సందర్శన తర్వాత రాజస్తాన్‌లోని పుష్కర్, శ్రీనాథ్‌ జీ దేవాలయాలను కూడా కల్వకుంట్ల కవిత సందర్శించారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement