
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో మావోయిస్టుల విషయంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ముగ్గురు తెలంగాణ రాష్ట్ర కమిటీ మెంబర్లు డీజీపీ శివధర్ రెడ్డి ఎదుట లొంగిపోయారు. ఈ నేపథ్యంలో ఈరోజు సాయంత్రం నాలుగు గంటలకు మీడియా సమావేశంలో డీజీపీ.. మిగతా విషయాలను వెల్లడించారు. లొంగిపోయిన వారిలో ముగ్గురు సీనియర్ మావోయిస్టు లీడర్లు.. కూకటి వెంకటి అలియాస్ వికాస్, మొగిలిచర్ల రాజు అలియాస్ CNM చందు, గంగవ్వ అలియాస్ సోనీ ఉన్నారు. కుంకటి వెంకట్ కూటిగల్ మదూర్ గ్రామానికి చెందిన వారిగా తెలుస్తోంది.