సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పాఠశాల విద్యార్థులకు స్పెషల్ కిట్ పంపిణీ చేయనున్నారు. 21 వస్తువులతో స్కూల్ కిట్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఒకే కలర్ యూనిఫామ్ అమలు చేయాలని కూడా సర్కార్ నిర్ణయించింది.
వచ్చే అకాడమిక్ ఇయర్ నుంచి అమలు చేసే యోచనలో ప్రభుత్వం ఉంది. రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రభుత్వ వ్యవస్థల్లో మొత్తం 26 లక్షల మంది విద్యార్థులు చదువుతుండగా.. రెసిడెన్షియల్ పాఠశాలల్లో 19 లక్షల మంది ఉన్నారు.


