22A వివాదం.. అసెంబ్లీలో మంత్రి పొంగులేటి కీలక ప్రకటన | Telangana Assembly Sessions Day 8 Updates | Sakshi
Sakshi News home page

22A వివాదం.. అసెంబ్లీలో మంత్రి పొంగులేటి కీలక ప్రకటన

Sep 18 2026 12:27 PM | Updated on Sep 18 2026 12:48 PM

Telangana Assembly Sessions Day 8 Updates

22ఏపై హైపవర్ కమిటీ ఏర్పాటు చేశాం: మంత్రి పొంగులేటి

జీవో 564 ద్వారా రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రెటరీ లోకేష్, రాజీవ్ గాంధీతో కమిటీ ఏర్పాటు చేశాం
జీవో 118 ద్వారా 22A లో ఇబ్బందులు పడుతున్న వాళ్లకు రేపు పట్టాలు ఇస్తున్నాం
22A నుంచి వాళ్ళను లిఫ్ట్ చేస్తున్నాం.
22A సింగరేణి ప్రాంతంలో 76 జీవోపై రేపు అసెంబ్లీలో భేటీ కానున్నాం
రేపే జీవో రూపంలో సమస్యను పరిష్కరించబోతున్నాం
జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్న సమస్యలను త్వరలోనే జీవో రూపంలో పరిష్కరిస్తాం.

తెలంగాణ వ్యాప్తంగా కరెంటు సమస్య ఉంది: కూనంనేని 

  • విద్యుత్ ఇవ్వలేని పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చింది: సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు 
  • ఐడల్ పవర్ ఉత్పత్తికి ప్రభుత్వం చర్యలు చేపట్టాలి
  • కొత్తగూడెంలో ఐడల్ పవర్ ఉత్పత్తిని పునరుద్ధరించాలి
  • ఉద్యోగుల పెండింగ్ బకాయిలను విడుదల చేయాలి.
  • తమిళనాడు తరహాలో ట్రాఫిక్ పోలీసులు కూర్చునే ఏర్పాటు చేయాలి
  • సింగరేణి కాంట్రాక్టు, ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకు మినిమం వేవ్స్ ఇవ్వాలని కోరుతున్నాం

హైకోర్టు తీర్పు వేళ అసెంబ్లీలో దానం ఆసక్తికర వ్యాఖ్యలు

  • హైకోర్టు తీర్పు వేళ అసెంబ్లీలో ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే దానం నాగేందర్‌
  • తన భవిష్యత్తు ఏమవుతుందో తనకే తెలియదంటూ ఆవేదన
  • నేను ఫైటర్‌ను.. ఫైట్‌ చేస్తా
  • నేడు తేలనున్న ఎమ్మెల్యే దానం భవితవ్యం
  • పార్టీ ఫిరాయింపు కేసుపై తీర్పు వెల్లడించనున్న హైకోర్టు
  • దానం పార్టీ మారలేదంటూ ఇప్పటికే స్పీకర్‌ క్లీన్‌చిట్‌
  • తాను బీఆర్‌ఎస్‌లోనే కొనసాగుతున్నానని హైకోర్టుకు తెలిపిన దానం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement