సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో పదో తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదల అయ్యింది. 2026 మార్చి 14 నుంచి ఏప్రిల్ 16 వరకు పరీక్షలు నిర్వహించనున్నట్లు బోర్డు మంగళవారం ప్రకటించింది. ఒక్కో ఎగ్జామ్కు మూడు రోజుల గ్యాప్ ఇవ్వనున్నట్లు అధికారులు చెబుతున్నారు. విద్యార్థులపై ఒత్తిడి తగ్గించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. షెడ్యూల్ ప్రకారం ఈ పరీక్షలు ప్రతి రోజు ఉదయం 9.30గంటలకు ప్రారంభమవుతాయని బోర్డు తెలిపింది.
- మార్చి 14- ఫస్ట్ లాంగ్వేజ్ - (గ్రూప్ -ఎ), ఫస్ట్ లాంగ్వేజ్ పార్ట్-1, ఫస్ట్ లాంగ్వేజ్ -పార్ట్ 2
- మార్చి 18 - సెకండ్ లాంగ్వేజ్
- మార్చి 23 - థర్డ్ లాంగ్వేజ్ (ఇంగ్లిష్)
- మార్చి 28- గణితం (మ్యాథమెటిక్స్)
- ఏప్రిల్ 2 - సైన్స్ (పార్ట్ -1) - భౌతిక శాస్త్రం (ఫిజికల్ సైన్స్)
- ఏప్రిల్ 7 - సైన్స్ - పార్ట్ 2 - బయోలాజికల్ సైన్స్
- ఏప్రిల్ 13 - సాంఘిక శాస్త్రం (సోషల్ స్టడీస్ )
- ఏప్రిల్ 15 - ఓఎస్ఎస్సీ మెయిన్ లాంగ్వేజ్ పేపర్ -1; ఎస్ఎస్సీ ఒకేషనల్ కోర్సు (థియరీ)
- ఏప్రిల్ 16 - ఓఎస్ఎస్సీ మెయిన్ లాంగ్వేజ్ పేపర్ -2


