నేడు, రేపు భగభగలే...! | Sakshi
Sakshi News home page

నేడు, రేపు భగభగలే...!

Published Thu, Apr 13 2023 4:48 AM

Summer Temperatures have risen in Telangana - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో పగటి ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పెరిగాయి. పలుచోట్ల 40 డిగ్రీల సెల్సియస్‌ కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో ఉష్ణోగ్రతలు కాస్త తక్కువగా ఉన్నప్పటికీ మిగతా ప్రాంతాల్లో మాత్రం భానుడి ప్రతాపం కొనసాగింది.

గురు, శుక్రవారాల్లో కూడా పలుప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల సెల్సియస్‌ నుంచి 43 డిగ్రీల సెల్సియస్‌ మధ్యన ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. బుధవారం రాష్ట్రంలో నమోదైన ఉష్ణోగ్రతలు పరిశీలిస్తే... గరిష్ట ఉష్ణోగ్రత ఆదిలాబాద్‌లో 41.8 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత మెదక్‌లో 22.0 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది.  

Advertisement
Advertisement