పది ఫలితాలు మే 4 లేదా 5న
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని పాఠశాలలకు శుక్రవారం సెలవులు ప్రారంభం అవుతున్నాయి. జూన్ 12న పాఠశాలలు తిరిగి తెరుచుకోనున్నాయి. కాగా పదవ తరగతి ఫలితాలు వచ్చే నెల 4 లేదా 5వ తేదీన వెలువడే అవకాశాలు ఉన్నాయి. రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలు ఈనెల 16వ తేదీన ముగిసాయి.
ఎస్ఎస్సీ బోర్డు మూల్యాంకనం వేగవంతం చేసి.. త్వరగా ఫలితాలు వెల్లడించేందుకు కసరత్తు ముమ్మరం చేసినట్లు అధికారవర్గాల సమాచారం. అధికారులు మాత్రం ఫలితాలు వెల్లడించే కచి్చతమైన తేదీని అధికారికంగా ఇప్పటి వరకు ప్రకటించలేదు.


