విషాదం: మరణించిన సోదరుడి చేతికి రాఖీ కట్టిన తోబుట్టువులు

Nalgonda Man Dead On Rakhi Purnima In Front Of Siblings - Sakshi

సాక్షి, నల్లగొండ: మాడుగులపల్లి మండలం మాలగూడెంలో రాఖీ పండగనాడు విషాదం చోటుచేసుకుంది. తోడబుట్టినవాడికి రాఖీ కట్టేందుకు ఇంటికొచ్చిన అక్కాచెల్లెళ్లకు తీరని శోకం మిగిలింది. శనివారం రాత్రి ఉన్నట్టుండి తీవ్ర అనారోగ్యానికి గురైన ఆ అక్కాచెల్లెళ్ల సోదరుడు చింతపల్లి లక్ష్మయ్య ప్రాణాలు కోల్పోయాడు.

మరణించిన లక్ష్మయ్య చేతికి రాఖీ కట్టి తోడబుట్టిన బంధం విలువ తెలిపిన ఆ అక్కాచెల్లెళ్లు కన్నీరుమున్నీరయ్యారు. రాఖీ పౌర్ణమినాడు జరిగిన ఈ ఘటన గ్రామంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో విషాదాన్ని నింపింది. అన్నకు రాఖీ కట్టేందుకు వారంతా నిన్ననే లక్ష్మయ్య ఇంటికి వచ్చినట్టు తెలిసింది. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top