కొమురవెల్లి మల్లన్న జాతర  | Komuravelli Mallanna Jatara Likely To Start On 18th Dec 2022 | Sakshi
Sakshi News home page

కొమురవెల్లి మల్లన్న జాతర 

Dec 18 2022 1:22 AM | Updated on Dec 18 2022 8:08 AM

Komuravelli Mallanna Jatara Likely To Start On 18th Dec 2022 - Sakshi

కొమురవెల్లి మల్లికార్జున స్వామి దేవాలయం 

సాక్షి, సిద్దిపేట: సిద్దిపేట జిల్లా కొమురవెల్లిలో మల్లన్న జాతర ఆదివారం నుంచి ప్రారంభం కానుంది. స్వామి వారి కల్యాణంతో మూడు నెలలపాటు జరిగే జాతరకు అంకురార్పణ జరగనుంది.

ఈనెల 18న ప్రారంభమై  మార్చి 20తో ముగుస్తుంది. మూడు నెలలపాటు బ్రహ్మో త్సవాలు జరిగే ఏకైక శైవక్షేత్రంగా కొమురవెల్లి ప్రసిద్ధి గాంచింది. ఈ ఉత్సవాలకు తెలుగు రాష్ట్రాలతో పాటు ఒడిశా, ఛత్తీస్‌గఢ్, కర్ణాటక నుంచి భక్తులు భారీగా తరలివస్తారు. నేటి కల్యాణానికి మంత్రులు హరీశ్‌రావు, ఇంద్రకరణ్‌రెడ్డి, జనగామ ఎమ్మెల్యే యాదగిరిరెడ్డి ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు, తలంబ్రాలను సమర్పించనున్నారు.  

Advertisement
 
Advertisement
Advertisement