
తమ సేవల్ని మరిన్ని నగరాలకు విస్తరిస్తామని ఇంటీరియర్ ఉత్పత్తులకు పేరొందిన నగరానికి చెందిన బియాండ్ కలర్ సంస్థ వ్యవస్థాపక సీఈఓ కుమార్ వర్మ తెలిపారు. గత మూడు రోజులుగా మాదాపూర్లోని హైటెక్స్ వేదికగా నిర్వహించిన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంటీరియర్ డిజైనర్స్ (ఐఐడీ) షో కేస్ ప్రదర్శన ముగిసింది. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ ఐఐడీ షో కేస్లో ప్రదర్శించిన తమ ఉత్పత్తులకు నగరవాసుల నుంచి అద్భుతమైన స్పందన లభించిందన్నారు.