హైదరాబాద్‌: కారు బోల్తా.. ఇన్ఫోసిస్‌ ఉద్యోగి మృతి | Hyderabad: Infosys Employee Dies After Car Overturns On Outer Ring Road | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌: కారు బోల్తా.. ఇన్ఫోసిస్‌ ఉద్యోగి మృతి

Sep 15 2025 8:41 AM | Updated on Sep 15 2025 8:44 AM

Hyderabad: Infosys Employee Dies After Car Overturns On Outer Ring Road

సాక్షి, హైదరాబాద్: పెద్ద అంబర్‌పేట్ సమీపంలోని ఔటర్‌ రింగ్‌ రోడ్డుపై కారు​ బోల్తాపడింది. ఈ ఘటనలో ఇన్ఫోసిస్‌ ఉద్యోగి మృతిచెందింది. మృతురాలిని సౌమ్యరెడ్డిగా గుర్తించారు. ఇన్ఫోసిస్ ఉద్యోగులు సరళ మైసమ్మ టెంపుల్ వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

ఈ ప్రమాదంలో ఏడుగురికి తీవ్ర గాయాలు కాగా, వారిని ఆసుపత్రికి తరలించారు. బొంగుళూరు గేట్ నుంచి పోచారం వైపు వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement