3 రోజుల్లో చలాన్లకు రూ. 8.44 కోట్ల చెల్లింపు | Huge Response For Pending Traffic Challan Payment With Discount Offer In Telangana | Sakshi
Sakshi News home page

3 రోజుల్లో చలాన్లకు రూ. 8.44 కోట్ల చెల్లింపు

Dec 29 2023 2:29 AM | Updated on Dec 29 2023 3:25 PM

Huge Response For Pending Traffic Challan Payment With Discount Offer In Telangana - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: పెండింగ్‌ ట్రాఫిక్‌ చలాన్ల రాయితీకి రాష్ట్ర వ్యాప్తంగా వాహనదారుల నుంచి భారీ స్పందన లభి స్తోంది. పెద్దఎత్తున జరిమానాలు పడిన వాహనదారులు ప్రభుత్వం ప్రకటించిన రాయితీని వినియోగించుకుంటు న్నారు. 3 రోజుల్లోనే 9.61 లక్షల చలాన్లకు సంబంధించి రూ.8.44 కోట్ల మేర జరిమానాలను చెల్లించారు. ఈ మేరకు రవాణా శాఖ వర్గాలు వివరాలు వెల్లడించాయి.

హైదరా బాద్‌ పోలీసు కమిషనరేట్‌ పరిధిలో 3.54 లక్షల చలాన్లతో రూ. 2.62 కోట్లు, సైబరాబాద్‌ కమిషనరేట్‌ పరి ధిలో 1.82 లక్షల చలాన్ల చెల్లింపుతో రూ.1.80 కోట్లు, రాచకొండ కమిషనరేట్‌ పరిధిలో 93 వేల చలాన్ల నుంచి రూ.76.79 లక్షల ఆదాయం సమకూరిందని అధికారులు తెలిపారు. కాగా, చెల్లింపులు అధికంగా ఉంటున్న నేపథ్యంలో సర్వర్‌ తరచూ మొరాయిస్తున్నట్లు వాహనదారులు తెలిపారు.  
 

Advertisement
 
Advertisement
Advertisement