High Court Hearing On MLA Poaching Case To CBI Has Been Adjourned, Details Inside - Sakshi
Sakshi News home page

MLA Poaching Case: హైకోర్టులో హీటెక్కిన విచారణ.. ఏం జరిగిందంటే?

Nov 30 2022 5:29 PM | Updated on Nov 30 2022 7:48 PM

High Court Hearing On MLA Poaching Case To CBI Has Been Adjourned - Sakshi

టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల కొనుగోలు కేసు అనూహ్య మలుపులు తిరుగుతోంది.

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల కొనుగోలు కేసు అనూహ్య మలుపులు తిరుగుతోంది. ఇప్పటికే ఈ కేసు దర్యాప్తు కోసం తెలంగాణ ప్రభుత్వం.. పోలీసు శాఖతో సిట్‌ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. కాగా, కేసు దర్యాప్తులో భాగంగా సిట్‌ 41ఏ సీఆర్‌పీసీ ​కింద నోటీసులు జారీ చేసింది. ఇక, ఈ నోటీసులపై బీజేపీ నేతలు హైకోర్టు ఆశ్రయించి ఊరట పొందారు. 

తాజాగా ఈ కేసును సీబీఐకి అప్పగించాలని బీజేపీ కోర్టును ఆశ్రయించింది. ఈ క్రమంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. వాదనలు విన్న న్యాయస్థానం తదుపరి విచారణను డిసెంబర్‌ 6వ తేదీకి వాయిదా వేసింది. అయితే, కోర్టులో ఈ కేసును సీబీఐతో విచారణ జరిపించాలన్న బీజేపీ పిటిషన్‌పై వాడివేడి వాదనలు జరిగాయి.

విచారణ సందర్భంగా..
బీజేపీ తరఫున మహేష్‌ జఠ్మలానీ..
- సిట్‌పై మాకు నమ్మకం లేదు. 
- సీబీఐతో దర్యాప్తు జరిపించాలి. 

సిట్‌ తరఫున దుష్యంత్‌ దవే..
- ఎమ్మెల్యేల కొనుగోలు కేసు తీవ్రమైన నేరం. 
- బీజేపీకి సంబంధం లేదంటారు.. నిందుతల తరఫున కేసులు వేస్తారు. 
- బీజేపీ అనేక చోట్ల ప్రభుత్వాలను పడగొట్టింది. 
- తెలంగాణ ప్రభుత్వాన్ని కూల్చడమే ధ్యేయంగా కుట్ర జరిగింది. 
- ఎమ్మెల్యేల కొనుగోలుపై పక్కా ఆధారాలున్నాయన్నారు. 

ఇక, అంతుకుముందు ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో నిందితుల బెయిల్‌ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా ప్రభుత్వ న్యాయవాది కీలక వ్యాఖ్యలు చేశారు. నిందితులకు బెయిల్‌ ఇస్తే సాక్ష్యాలు తారుమారు చేస్తారని కామెంట్స్‌ చేశారు. దీంతో, కోర్టు విచారణనున రేపటి(గురువారాని)కి వాయిదా వేసింది. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement