Nagoba Jatara: మొదలైన ‘నాగోబా’ జాతర.. ఆదివాసీలతో జనసంద్రంగా మారిన కేస్లాపూర్‌

Grandly Nagoba Fair Begins In Adilabad District - Sakshi

ఇంద్రవెల్లి/ఉట్నూర్‌(ఖానాపూర్‌): ఆదివా­సీలు గూడేలు వీడెను. నాగోబా నీడన చేరె­ను. ఆదివాసీల ఆరాధ్య దైవమైన నాగో­బా జాతర శనివారం మొదలైంది. వేలాదిగా తరలివచ్చిన గిరిజనులతో ఆదిలాబాద్‌ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్‌ జనసంద్రంగా మారింది. మూడురోజులుగా వడమర­(మర్రిచెట్ల) వద్ద విడిది చేసిన మెస్రం వంశీయులు తూమ్‌ పూజలు(చనిపోయిన వా­రికి కర్మకాండలు) నిర్వహించి శనివారం ఉద­యం ఆలయానికి చేరుకున్నారు.

పుష్య అ­మా­వాస్య అర్థరాత్రి పవిత్ర గంగాజలా­లతో నాగోబాను అభిషేకించిన అనంతరం జాతర ప్రారంభమైంది. మెస్రం వంశీయులు ఉద­యం నుంచి ఆచార సంప్రదాయాలు పాటి­స్తూ నాగోబాను స్మరిస్తూ ప్రత్యేక పూజలు చేపట్టారు. ఆలయ సమీపంలోని వడమర వద్ద విడిది చేసిన మెస్రం వంశీయులు, పెద్ద­లు(పటేళ్లు) శనివారం తెల్లవా­రు­జామున 84 మందికి తూమ్‌ నిర్వహించారు. శనివారం నాగేంద్రుడి విగ్రహంతో ని­య­మనిష్టలు, వాయిద్య చప్పుళ్ల మధ్య ఆలయానికి చేరుకు­న్నారు.

సిరికొండ మండల కేంద్రం నుంచి తెప్పించిన మట్టికుండలకు మెస్రం పెద్దలు పూజలు నిర్వహించారు. మెస్రం వంశంలోని 22 తెగలకు చెందిన ఆడపడుచులు పెద్దల­కు, పూజారులకు పాదాభివందనం చేస్తూ నా­యక్‌పాడ్‌ నుంచి మట్టికుండలు స్వీకరించారు. అనంతరం వడమర సమీపంలోని కోనే­రు నుంచి పవిత్ర­జ­లాలను నాగోబా సన్నిధికి తెచ్చారు.

గతే­డా­ది నిర్మించిన మట్టి­పుట్టలను మెస్రం వంశ అల్లుళ్లు తొలగించగా దానిస్థానంలో కొత్తగా పుట్టల­ను తయారు చేశారు. మట్టి ఉండలను మహి­ళలు చేతుల మీదుగా తరలించి సతిదేవతల ఎదుట మొ­క్కు­లు తీర్చుకున్నా­రు. అనంతరం మెస్రం వంశీయులు గోవా­డా (గుండ్రంగా గోడకట్టి ఉండే ప్రదేశం) చేరుకుని విడిది చేశారు. మహాపూజకు ఉన్న­తాధికా­రులు, ప్రజాప్రతి­ని­ధులు హాజరు కాగా జాతరకు ఉమ్మడి జిల్లా నలుమూలాల నుంచే కాకుండా ఇతర జిల్లాలు, రాష్ట్రాల నుంచి ఆదివాసీలు, గిరిజనేతరులు భారీగా తరలివచ్చారు.

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top