వర్షం ఉంటే బడులకు సెలవులివ్వండి | Education department directive to district officials | Sakshi
Sakshi News home page

వర్షం ఉంటే బడులకు సెలవులివ్వండి

Sep 7 2023 3:11 AM | Updated on Sep 7 2023 3:11 AM

Education department directive to district officials - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో స్కూళ్లను నడపాలా? వద్దా? అనే విషయాన్ని జిల్లా యంత్రాంగమే నిర్ణయించుకోవాలని రాష్ట్ర విద్యాశాఖ స్పష్టం చేసింది. ఇందుకు సంబంధించి డీఈవోలకు అంతర్గత ఉత్తర్వులు జారీ చేసింది. ఒక్కో ప్రాంతంలో వర్షం ప్రభావం ఒక్కోలా ఉంటోంది. కొన్ని ప్రాంతా­ల్లో భారీ వర్షాలతో ఇబ్బందికరమైన పరిస్థితులు ఉండగా, కొన్నిచోట్ల వర్ష ప్రభావం అంతగా ఉండటం లేదు. ఈ కారణంగా రాష్ట్రవ్యాప్తంగా అన్ని పాఠశా­ల­లకు సెలవులు ప్రకటించడం సరికాదని ఉన్నతాధి­కారులు అభిప్రాయప­డుతు­న్నా­రు.

వాతావరణ శాఖ నివేదికను పరిగణనలోనికి తీసుకుని రాష్ట్రవ్యాప్తంగా సెల­వులు ఇవ్వాలన్న ఉపాధ్యాయ సంఘాల డిమాండ్‌ను విద్యాశాఖ తిరస్కరించింది. హైదరా­బాద్‌లో తీవ్ర స్థాయిలో వర్షం ఉన్నప్పటికీ, కొన్ని జిల్లాల్లో వర్షం ఏమాత్రం లేదని అధికారులు చెబుతున్నారు. కొన్ని జిలా­్లల్లో వర్షం కారణంగా స్కూళ్లు నడపలేని పరిస్థితి ఉన్న­ప్పుడు, మరికొన్ని జిల్లాల్లో సాధారణ పరిస్థితులు ఉంటున్నా­యని గుర్తించారు. వర్షం తీవ్రంగా ఉండి, వరదలు, వాగులు పొంగడం వంటి పరిస్థితులు ఉన్నప్పుడు విద్యా­ర్థులు స్కూళ్లకు రాలేరని విద్యాశాఖ భావిస్తోంది.

అలాం­టప్పుడు జిల్లావ్యాప్తంగా సెలవు ప్రకటించే అధి­కారం ఆ జిల్లా యంత్రాంగానికే ఉంటుందని, ఈ దిశగా స్పష్టమైన ఆదే­శాలు ఇస్తున్నామని ఓ అధికారి తెలిపారు. వర్షాలతో ఎక్కువ రోజులు సెలవులు ఇచ్చిన పక్షంలో ఇతర సా«­దారణ సెలవులు తగ్గించి, సిలబస్‌ పూర్తికి చర్యలు తీసుకోవాలని, అవసరమై­నప్పుడు ప్రత్యేక క్లాసులు కూడా నిర్వహించాలని విద్యాశాఖ అధికారులకు సూచించింది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement