సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో చలి తీవ్రత పెరిగింది. గురువారం రాత్రి నుంచే రాష్ట్రవ్యాప్తంగా కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతుండగా.. శుక్రవారానికి మరింతగా పడిపోయాయి. రాత్రిపూట, తెల్లవారుజామున చలిగాలుల (Cold Waves) తీవ్రత ఎక్కువైంది. మరోవైపు.. హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో చలి తీవ్రత పెరిగింది. మంచు కారణంగా తెల్లవారుజామున వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఆదిలాబాద్ జిల్లా బేలలో శుక్రవారం అతి తక్కువగా 14.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. అలాగే, రంగారెడ్డి జిల్లాలోని షాబాద్లో 14.7 డిగ్రీలు, సంగారెడ్డిలోని జహీరాబాద్లో 14.8, శంకర్పల్లిలో 14.9, మొయినాబాద్లో 15 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. ఇక, కొమురంభీమ్ ఆసిఫాబాద్, నిర్మల్, జగిత్యాల, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, కామారెడ్డి, మెదక్, సిద్ధిపేట, సంగారెడ్డి, వికారాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్, మహబూబ్నగర్, నారాయణపేట, నాగర్ కర్నూల్, యాదాద్రి భువనగిరి, జనగామ, పెద్దపల్లి జిల్లాల్లో చలి తీవ్రత ఎక్కువైంది. అలాగే, హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు పడిపోయాయి.
COLD WEATHER INTENSIFIES 🥶
Today's lowest temperatures in °C
Telangana toppers
Bela Adilabad 14.7
Shahbad Rangareddy 14.7
Zahirabad Sangareddy 14.8
Shankarpally 14.9
Moinabad 15
Bheempoor Adilabad 15
Jinnaram Sangareddy 15.1
Hyderabad toppers
Rajendranagar 15.3
UoH 15.3…— Telangana Weatherman (@balaji25_t) November 8, 2025


