తెలంగాణలో 23 మంది ఐపీఎస్‌ల బదిలీ | Telangana: 23 IPS Officers Transferred - Sakshi
Sakshi News home page

తెలంగాణలో 23 మంది ఐపీఎస్‌ల బదిలీ

Jan 3 2024 8:14 PM | Updated on Jan 3 2024 9:06 PM

26 IPS Officers Transferred In Telangana Hours After IAS Transfers - Sakshi

సాక్షి, హైదరాబాద్‌:  తెలంగాణలో భారీగా ఐపీఎస్‌లు బదిలీ అయ్యారు. 23 మంది ఐపీఎస్‌ అధికారులను బదిలీ చేస్తూ సీఎస్‌ శాంతి కుమారి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. అయితే ఇంతకముందే 26 మంది ఐఏఎస్‌ల బదీలీ చేసిన విషయం తెలిసిందే. కేవలం గంటల వ్యవధిలోనే ఐపీఎస్‌లకు కూడా స్థాన చలనం కల్పించడం గమనార్హం.

బదిలీ అయిన ఐపీఎస్‌లు వీరే..
►టెక్నికల్‌ సర్వీసెస్‌ అదనపు డీజీగా వీవీ శ్రీనివాసరావు నియామకం
►ఉమెన్‌ సేఫ్టీ వింగ్‌ డీఐజీగా రెమా రాజేశ్వరి
►మల్టీజోన్‌-7 డీసీపీగా జోయల్‌ డెవిస్‌
►సీఐడీ ఎస్పీగా రాజేంద్రప్రసాద్‌
►హైదరాబాద్‌ ట్రాఫిక్‌-3 డీసీపీగా వెంకటేశ్వర్లు
►సౌత్‌ ఈస్ట్‌​ జోన్‌ డీసీపీగా జానకీ దరావత్‌
►ఎల్బీనగర్‌ డీసీపీగా ప్రవీణ్‌కుమార్‌
►మేడ్చల్‌ డీసీపీగా నితికాపంత్‌
►మాదాపూర్‌ సీడీపీగా వినిత్‌
►కో-ఆర్డినేషన్‌ డీఐజీగా డా. గజారావ్‌ భూపాల్‌
►రాజేంద్రనగర్‌ డీసీపీగా శ్రీనివాస్‌

►రామగుండం సీపీగా ఎల్‌ఎస్‌ చౌహాన్‌
►మల్కాజ్‌గిరి డీసీపీగా పద్మజ
►నిర్మల్‌ ఎస్పీగా జానకీ షర్మీల
►ఖమ్మం సీపీగా సునీల్‌ దత్‌
►సీఐడీ ఎస్పీగా రాజేంద్ర ప్రసాద్‌
►ట్రాన్స్‌కో ఎస్పీగా ఉదయ్‌ కుమార్‌ రెడ్డి
►ఆదిలాబాద్‌ ఎస్పీగా గౌష ఆలం
►ములుగు ఎస్పీగా శబరీష్‌
►సిద్దిపేట ఎస్పీగా బీ అనురాధ
► కొత్తగూడెం ఎస్పీగా రోహిత్‌రాజు
►మెదక్‌ ఎస్పీగా బాలస్వామి
►జయశంకర్‌ భూపాలపల్లి ఓఎస్డీగా అశోక్‌ కుమార్‌

Advertisement
 
Advertisement
Advertisement