ఒక గుడిసె.. 21 పాము పిల్లలు!  | 21 Small Snakes Found In House Near Mahabubnagar | Sakshi
Sakshi News home page

ఒక గుడిసె.. 21 పాము పిల్లలు! 

Mar 17 2021 6:43 AM | Updated on Mar 17 2021 11:32 AM

21 Small Snakes Found In House Near Mahabubnagar - Sakshi

అడ్డాకుల (మహబూబ్‌నగర్‌): ఓ పూరి గుడిసెలో మట్టిని తవ్వగా 21 పాము పిల్లలు బయటపడటం కలకలం రేపింది. మహబూబ్‌నగర్‌ జిల్లా అడ్డాకులలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాల వెనుక భాగంలో ఉండే గుడిసెల్లో మూడు కుటుంబాలు జీవిస్తున్నాయి. అందులో బుడగజంగం చిన్న కుర్మన్న నివాసముంటున్న గుడిసెలో దుర్వాసన రావడంతో మంగళవారం ఉదయం ఓ మూలన ఉన్న మట్టిని తవ్వారు.

దీంతో అందులోంచి ఒక్కొక్కటిగా పాము పిల్లలు బయటకు వచ్చాయి. మొత్తం 21 పాము పిల్లలు బయటకు రాగా, వాటిని కర్రతో కొట్టి చంపేశారు. పది రోజుల క్రితం ఇదే గుడిసెలో ఉన్న ఓ పెద్ద పామును కూడా ఇలాగే చంపేశారు. కాగా, అక్కడే ఆరుగురు చిన్నపిల్లలు ఉండగా ఎవరికీ అపాయం కలగలేదు.
చదవండి:
కుక్క మలవిసర్జన..దంపతులపై కేసు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement