Local Train: ప్లాట్‌ఫామ్‌పైకి దూసుకువచ్చిన లోకల్‌ ట్రైన్‌.. ప్రయాణికుల పరుగులు

Local Train Lost Control And Climbed Over The Platform - Sakshi

సబర్బన్‌ రైలు ప్లాట్‌ఫామ్‌పైకి దూసుకువచ్చింది. ఈ ఘటన తమిళనాడు రాజధాని చెన్నైలోని బీచ్‌ స్టేషన్‌లో చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. కాగా, చెన్నై వర్క్‌షాప్‌ నుంచి కోస్టల్‌ రైల్వేస్టేషన్‌ వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. అయితే, నియంత్రణ కోల్పోయి భారీ శబ్దంతో ప్లాట్‌ఫామ్‌ వైపుపైకి దూసుకోచ్చింది. ఈ క్రమంలో ప్లాట్‌ఫామ్‌పై ఉన్న ప్రయాణీకులందరూ పరుగులు పెట్టారు. రైలులో ఉన్న పలువురు ప్రయాణికులు సైతం రైలు నుంచి బయటకు దూకారు.

ఈ ప్రమాదంలో రైలు డ్రైవర్‌ మాత్రం గాయపడగా వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించారు. కాగా, ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. సమాచారం అందుకున్న రైల్వే అధికారులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు.
 

Read latest Tamil Nadu News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top