– ఎంపీ,వీసీకే నేత తిరుమావళవన్
సాక్షి, చైన్నె : తమిళనాడులో ద్రవిడ పార్టీల ప్రాభవాన్ని ఏకకాలంలో దెబ్బతీసేందుకు బీజేపీ, ఆర్ఎస్ఎస్ శక్తులు తెరవెనుక కుట్ర రాజకీయాలు చేస్తున్నాయనివీసీకే నేత, ఎంపీ తోల్ తిరుమావళవన్ ఆరోపించారు. అరియలూర్ జిల్లా అంగనూర్ లో తొల్కాప్పియన్ వర్ధంతి సందర్భంగా నివాళుల ర్పించిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. తమిళనాడులో అన్నాడీఎంకే పార్టీని పూర్తిగా తుడిచిపెట్టడమే లక్ష్యంగా బీజేపీ, ఆర్ఎస్ఎస్ వ్యూ హాత్మకంగా అడుగులు వేస్తున్నాయన్నారు. అన్నాడీఎంకే ప్రధాన ఓటు బ్యాంకుగా ఉన్న పశ్చిమ జిల్లాలపై ప్రత్యేక దృష్టి పెట్టి అన్నామలై బహిరంగ సభలు నిర్వహించడం ఇందులో భాగమేనని పేర్కొన్నారు. అన్నాడీఎంకే బలహీనపడితే, ఆ తర్వాత డీఎంకేను ఒంటరి చేసి దెబ్బతీయవచ్చని సంగ్ పరివార్ భావిస్తున్నదన్నారు. తమిళనాడులో రెండు బలమైన శక్తుల మధ్య రాజకీయం సమరం అన్న పట్టుదలతో కొత్తగా ఏర్పడిన టివీకే ఉన్నట్టుంద న్నారు. అయితే, బీజేపీ కుట్రల వెనుక టీవీకే పాత్ర కూడా ఉందా అనే విషయాన్ని ఆ పార్టీ నాయకత్వా న్నే అడగాలని ఆయన స్పష్టం చేశారు. అలాగే టీవీ కే–పీఎంకేపై తాను స్పందించబోనని చెప్పారు.
నేడు రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అదనపు టోకెన్లు
– దస్తావేజుల నమోదు కోసం
ప్రత్యేక నిబంధన
కొరుక్కుపేట: పవిత్రమైన, ప్రత్యేకమైన రోజులుగా పరిగణించబడే రోజులలో అధిక సంఖ్యలో పత్రాల నమోదులు జరుగుతాయి ఈనేపథ్యంలో ప్రజల అభ్యర్థనలకు ప్రతిస్పందనగా ఆ రోజులలో పత్రాల నమోదు కోసం అదనపు రిజర్వేషన్ టోకెన్లు కేటాయిస్తున్నారు. ఆషాఢ మాసం ప్రారంభం కాబోతున్నందున, గురువారం ఆణి మాసం చివరి రోజున పెద్ద సంఖ్యలో బాండ్ రిజిస్ట్రేషన్లు జరగనున్నందున, అదనపు రిజర్వేషన్ టోకెన్లను కేటాయించాలని ప్రజల నుంచి అభ్యర్థనలు వస్తున్నాయి. దీనిని అనుసరించి, గురువారం నుండి, ఒక సబ్–రిజిస్ట్రార్ ఉన్న కార్యాలయాలకు 100కి బదులుగా 150 రిజర్వేషన్ టోకెన్లు, రెండు సబ్–రిజిస్ట్రార్లు ఉన్న కార్యాలయాలకు 200కి బదులుగా 300 రిజర్వేషన్ టోకెన్లు ఇస్తున్నారు. అధిక సంఖ్యలో పత్రాల నమోదులు జరిగే 100 నుండి 100 కార్యాలయాలకు బదులుగా 150 సాధారణ బుకింగ్ టోకెన్లను, ఇప్పటికే జారీ చేసిన 12 తత్కాల్ బుకింగ్ టోకెన్లకు అదనంగా, ప్రజల ఉపయోగం కోసం మరో 4 తత్కాల్ బుకింగ్ టోకెన్లను జారీ చేయాలని ఆదేశించబడిందని ఆ శాఖాధికారులు వెల్లడించారు.
ఫ్రిజ్ కొనుగోలుకు కూపన్లు!
– సి. విజయభాస్కర్, ఎన్నికల సంఘానికి నోటీసులు
సాక్షి, చైన్నె : ఎన్నికల ప్రచారంలో ఓటర్లను ఆకర్షించడానికి ఫ్రిజ్ కొనుగోలు కూపన్లు పంపిణీ చేసి అక్రమాలకు పాల్పడ్డారనే కేసులో మాజీ మంత్రి, టీవీకే నేత సి. విజయభాస్కర్ , ఎన్నికల సంఘం వివరణ ఇవ్వాలని మద్రాస్ హైకోర్టు బుధవారం నోటీసులు జారీ చేసింది. వివరాలు.. ఇటీవల జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పుదుక్కోట్టై జిల్లాలోని విరాలిమలై నియోజకవర్గం నుండి అన్నాడీఎంకే అభ్యర్థిగా పోటీ చేసిన సి. విజయభాస్కర్ తన సమీప ప్రత్యర్థి, టీవీకేకు చెందిన మురుగేశన్ను ఓడించారు. అయితే, ఈ ఎన్నికల్లో డీఎంకే తరఫున పోటీ చేసి ఓడిపోయిన అభ్యర్థి కె.కె. చెల్లపాండియన్ చైన్నె హైకోర్టులో సి. విజయభాస్కర్ విజయానికి వ్యతిరేకంగా ఎన్నికల పిటిషన్ దాఖలు చేశారు.
పిటిషనర్ ఆరోపణలు
పిటిషన్లో చెల్లపాండియన్ పలు తీవ్రమైన ఆరోపణలు చేశారు: విజయభాస్కర్ తన ఎన్నికల ప్రచారంలో ఓటర్లు తనకు అనుకూలంగా ఓటు వేయాలని కోరుతూ రూ. 10,000, రూ. 2,000 విలువైన కూపన్లను పంపిణీ చేశారని వివరించారు. ఓటర్లు ఉచితంగా లేదా రాయితీతో ఫ్రిజ్లు కొనుగోలు చేసేందుకు ఈ కూపన్లను పంపిణీ చేస్తూ భారీ ఎన్నికల అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు. చట్టవిరుద్ధమైన పద్ధతుల్లో సాధించిన సి. విజయభాస్కర్ విజయాన్ని చెల్లనిదిగా ప్రకటించాలని కోర్టును కోరారు. ఈ పిటిషన్ విచారణలో ఉన్న తరుణంలో విజయ భాస్కర్ తన పదవికి రాజీనామా చేసి టీవీకేలో చేరారు.
కోర్టు ఆదేశం: ఈ పిటిషన్ను విచారణకు స్వీకరించిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్. సెంథిల్కుమార్, కూపన్ల పంపిణీ ద్వారా జరిగిన అక్రమాలపై పిటిషనర్ సమర్పించిన ఆధారాలను రికార్డుల్లోకి తీసుకున్నారు. ఈ వ్యవహారంపై పూర్తి వివరణ ఇవ్వాలని స్పష్టం చేస్తూ మాజీ మంత్రి సి. విజయభాస్కర్కు , భారత ఎన్నికల సంఘానికి నోటీసులు జారీ చేశారు. అనంతరం ఈ కేసు తదుపరి విచారణను న్యాయమూర్తి మూడు వారాల పాటు వాయిదా వేశారు.


