గ్యాస్‌ ధర పెంపుతో మధ్యతరగతి అస్తవ్యస్తం | - | Sakshi
Sakshi News home page

గ్యాస్‌ ధర పెంపుతో మధ్యతరగతి అస్తవ్యస్తం

Jun 8 2026 7:06 AM | Updated on Jun 8 2026 7:06 AM

– ఎస్‌డీబీఐ పార్టీ మండిపాటు

కొరుక్కుపేట: గ్యాస్‌ ధరలను పెంచుతూ పేద ప్రజలను కేంద్ర ప్రభుత్వం మోసం చేస్తోందని ఎస్‌డీబీఐ పార్టీ రాష్ట్ర కోశాధికారి ముస్తఫా ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం గృహ వినియోగ ఎల్పీజీ సిలిండర్ల ధరను మరోసారి పెంచింది. ఇప్పటికే పెరుగుతున్న ధరలతో ఇబ్బందులు పడుతున్న సాధారణ, మధ్యతరగతి కుటుంబాల నెలవారీ బడ్జెట్‌ను ఇది పూర్తిగా అస్తవ్యస్తం చేస్తుందన్నారు. ఇటీవల వాణిజ్య అవసరాల కోసం వాడే సిలిండర్ల ధరను గణనీయంగా పెంచినప్పటికీ, ఇప్పుడు గృహ వినియోగం కోసం వాడే సిలిండర్ల ధరను పెంచడం పేద, సామాన్య ప్రజలను మోసం చేయడమే అని అన్నారు. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు, గ్యాస్‌ ధరలు తగ్గే సమయాల్లో, ప్రజలకు ప్రయోజనాలు కల్పించకుండా ధరలను తగ్గించడానికి ప్రభుత్వం నిరాకరిస్తుంది. ధరలు పెరిగినప్పుడు మాత్రమే ఆ భారాన్ని వెంటనే ప్రజలపై మోపుతుంది. అందువల్ల, పేద, సామాన్య ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని, కేంద్ర ప్రభుత్వం ఈ ధరల పెంపును తక్షణమే ఉపసంహరించుకోవాలి అని డిమాండ్‌ చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement