మట్టపల్లిలో నిత్యకల్యాణం

మఠంపల్లి: మట్టపల్లి క్షేత్రంలో శుక్రవారం శ్రీరాజ్యలక్ష్మీ చెంచులక్ష్మీ సమేత శ్రీలక్ష్మీనరసింహస్వామి నిత్యకల్యాణాన్ని అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈసందర్భంగా ఆలయంలో సుప్రభాతసేవతోపాటు స్వామి అమ్మవార్లకు అష్టోత్తర సహస్త్ర నామార్చన, కుంకుమార్చనలు చేపట్టారు.

అనంతరం నూతన పట్టు వస్త్రాలతో వధూవరులుగా అలంకరించి ఎదుర్కోలు నిర్వహించారు. ఆ తర్వాత మాంగళ్యధారణ, తలంబ్రాలతో కల్యాణం జరిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ అనువంశిక ఽచైర్మన్‌ చెన్నూరు విజయ్‌కుమార్‌, ఈఓ నవీన్‌, అర్చకులు లక్ష్మణాచార్యులు, పద్మనాభాచార్యులు, ఫణిభూషణమంగాచార్యులు, లక్ష్మీనరసింహమూర్తి, ఆంజనేయాచార్యులు, భక్తులు పాల్గొన్నారు.

Read latest Suryapet News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top