నరసన్నపేట: మండలంలోని గోపాలపెంటకు సాగునీరు విడుదల చేయాలని, నీరు లేక పొలాలు ఎండిపోతున్నాయని నీటి సంఘం గోపాలపెంట డైరెక్టర్ తోట భార్గవ్, రైతులు బొబ్బాది ఈశ్వరరావు, గదిలి రమేష్, సనపల రమేష్, మార్పు అమ్మాజీ బుడుమూరు రమణ తదితరులు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు గురువారం స్థానిక వంశధార ఈఈ కార్యాలయ హెచ్డీ నారాయణమూర్తికి విన తి పత్రం అందించారు. ఈ సందర్భంగా బొబ్బాది ఈశ్వరరావు మాట్లాడుతూ కాలువల్లో పూడిక తీయలేదని, చుక్క నీరు రావడం లేదని ఆందోళన చెందారు. ఏటా నష్ట పోతున్నామని, వంశధార అధికారులు పట్టించుకోవడం లేదని అన్నారు. ఇకనైనా చర్యలు తీసుకోవాలని కోరారు.


