ఉత్సాహంగా వజ్రోత్సవ పోటీలు | - | Sakshi
Sakshi News home page

ఉత్సాహంగా వజ్రోత్సవ పోటీలు

Aug 15 2025 8:27 AM | Updated on Aug 15 2025 8:27 AM

ఉత్సాహంగా వజ్రోత్సవ పోటీలు

ఉత్సాహంగా వజ్రోత్సవ పోటీలు

ఉత్సాహంగా వజ్రోత్సవ పోటీలు

శ్రీకాకుళం కల్చరల్‌: జిల్లా ఏర్పడి 75 ఏళ్లు పూర్తయి న సందర్భంగా విద్యార్థులకు నిర్వహించిన వ్యాసరచన, డిబేట్‌, చిత్రలేఖనం పోటీలు గురువారంతో ముగిశాయి. నియోజకవర్గ స్థాయిలో 75 మందిని ఎంపిక చేసి తుది పోటీలు ఆర్ట్స్‌ కళాశాలలో నిర్వహించారు.

విజేతలు వీరే..

వ్యాసరచన: ఆమదాలవలస ప్రభుత్వ జూనియర్‌ కళాశాల విద్యార్థిని కె.నక్షత్ర ప్రథమ, టెక్కలి విశ్వ జ్యోతి జూనియర్‌ కళాశాల విద్యార్థిని జె.ఇందు ద్వితీయ, ఎస్‌ఆర్‌ జూనియర్‌ కళాశాల విద్యార్థి ఎం. మేఘరాజ్‌ తృతీయ స్థానాలు సాధించారు.

డిబేట్‌: చాపర ఎస్‌కేకే జూనియర్‌ కళాశాల విద్యార్థి ని ఏ.ప్రియాంక, ప్రభుత్వ జూనియర్‌ కళాశాల విద్యార్థి జి.శ్రావణి, సారవకోట కార్మెల్‌ జూనియర్‌ కళాశాల విద్యార్థిని ఎన్‌.రుతో తొలి మూడు స్థానా లు సాధించారు.

చిత్రలేఖనం: ఆమదాలవలస ఎంజేపీ ఏపీబీసీ డబ్ల్యూ కళాశాల విద్యార్థిని పి.ధనశ్రీ ప్రథమ, పలా స శ్రీచైతన్య జూనియర్‌ కళాశాల విద్యార్థిని టి. జ్యోత్స్న ద్వితీయ, నౌపడా ప్రభుత్వ జూనియర్‌ కళాశాల విద్యార్థిని బి.దీపిక తృతీయ బహుమతి గెలుచుకున్నారు. విజేతలను రీజనల్‌ ఇన్‌స్పెక్షన్‌ ఆఫీసర్‌ ప్రగడ దుర్గారావు, జిల్లా ఉపాధి కల్పనాధికారి కొంతలెంక సుధ అభినందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement