సచివాలయ ఉద్యోగికి ఉన్నత కొలువు | - | Sakshi
Sakshi News home page

సచివాలయ ఉద్యోగికి ఉన్నత కొలువు

Jan 29 2026 10:10 AM | Updated on Jan 29 2026 10:10 AM

సచివాలయ ఉద్యోగికి ఉన్నత కొలువు

సచివాలయ ఉద్యోగికి ఉన్నత కొలువు

ధర్మవరం అర్బన్‌: బత్తలపల్లి మండలానికి చెందిన షేక్‌ చాంద్‌బాషా, గౌసియాబేగం దంపతుల ఒక్కగానొక్క కుమారుడు షేక్‌ దాదాపీర్‌ గత వైఎస్సార్‌సీపీ హయాంలో ధర్మవరం మున్సిపాలిటీలో 12వ వార్డు సచివాలయ అడ్మిన్‌గా ఉద్యోగాన్ని సాధించారు. అప్పటి నుంచి ఓ వైపు విధులు నిర్వర్తిస్తూనే మరోవైపు రాత్రి, తెల్లవారుజామున గ్రూప్‌–2 పరీక్షలకు సన్నద్దమవుతూ వచ్చారు. ఈ క్రమంలో గ్రూప్‌–2 పరీక్ష ఫలితాల్లో డైరెక్టర్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్‌ విభాగం జూనియర్‌ అసిస్టెంట్‌ పోస్టుకు అర్హత సాధించారు. విషయం తెలుసుకున్న ధర్మవరం మున్సిపల్‌ కమిషనర్‌ వెంకటరమణయ్య, రాష్ట్ర స్వర్ణ గ్రామ, వార్డు ఉద్యోగుల అధ్యక్షుడు షేక్‌ మహబూబ్‌బాషా, తోటి ఉద్యోగులు దాదాపీర్‌ను అభినందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement