కోవూరు: వైఎస్సార్సీపీ పీఏసీ సభ్యుడు, మాజీ మంత్రి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్రెడ్డిని మంగళవారం నెల్లూరులోని నివాసంలో పలువురు నేతలు కలిశారు. మాజీ మంత్రి డాక్టర్ పి.అనిల్కుమార్ యాదవ్, ఎమ్మెల్సీ, మేరిగ మురళీధర్, పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ఊటుకూరు మహేందర్రెడ్డి, కోవూరు నియోజకవర్గ యువజన విభాగం అధ్యక్షుడు నల్లపరెడ్డి రజత్కుమార్రెడ్డి, ఆ నియోజకవర్గ పరిశీలకుడు కొండూరు అనిల్బాబు తదితరులు పార్టీ బలోపేతంపై చర్చించారు. ప్రజా సమస్యలను గుర్తించి వాటిపై పోరాటాలు నిర్వహించడంపై చర్చించినట్లు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.


