Sunrisers Hyderabad To Donate 30 Crores Towards COVID-19 Relief Efforts To SUN TV - Sakshi
Sakshi News home page

కోవిడ్‌పై పోరు: సన్‌రైజర్స్‌ భారీ విరాళం

May 10 2021 1:48 PM | Updated on May 10 2021 2:30 PM

Sunrisers Hyderabad Donate INR 30 Crore India Fight Against Covid 19 - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: మహమ్మారి కోవిడ్‌-19పై భారత్‌ పోరులో భాగంగా సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ భారీ విరాళం ప్రకటించింది. తన వంతు సాయంగా రూ. 30 కోట్లను కోవిడ్‌ రిలీఫ్‌ ఫండ్‌కు అందజేయనున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు ట్విటర్‌ వేదికగా ప్రకటన విడుదల చేసింది. ‘‘కరోనా సెకండ్‌వేవ్‌ కారణంగా ప్రభావితమైన బాధితులకు అండగా ఉండేందుకు సన్‌ టీవీ నెట్‌వర్క్‌ రూ. 30 కోట్లను విరాళంగా ఇస్తోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేపడతున్న వివిధ కార్యక్రమాలకు ఈ నిధులను ఉపయోగించనున్నాం. ఆక్సీజన్‌ సిలిండర్లు, మెడిసిన్‌ సరఫరా నిమిత్తం ఎన్జీఓలతో భాగస్వామ్యమై ముందుకు సాగుతాం. అంతేకాదు మీడియా ద్వారా కరోనా వ్యాప్తి అడ్డుకట్టకై తీసుకోవాల్సిన చర్యల గురించి అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తాం’’ అని పేర్కొంది.

Advertisement
 
Advertisement
Advertisement