25 పతకాలతో టాప్‌లో.. | Shooting World Cup: India Take Gold in 50m Rifle | Sakshi
Sakshi News home page

25 పతకాలతో టాప్‌లో..

Mar 27 2021 2:38 PM | Updated on Mar 27 2021 2:38 PM

Shooting World Cup: India Take Gold in 50m Rifle - Sakshi

న్యూఢిల్లీ: ప్రపంచకప్‌ షూటింగ్‌ టోర్నీలో భారత షూటర్ల ఆధిపత్యం కొనసాగుతోంది. టోర్నీ ఎనిమిదో రోజు భారత్‌కు రెండు స్వర్ణాలు, ఒక రజతం, ఒక కాంస్యం లభించాయి. 50 మీటర్ల రైఫిల్‌ త్రీ పొజిషన్‌ మిక్స్‌డ్‌ ఈవెంట్‌లో సంజీవ్‌ రాజ్‌పుత్‌–తేజస్విని సావంత్‌ జంట పసిడి పతకం నెగ్గగా... ఐశ్వరీ ప్రతాప్‌సింగ్‌–సునిధి ద్వయం కాంస్యం గెలి చింది.

50 మీటర్ల రైఫిల్‌ త్రీ పొజిషన్‌ పురుషుల టీమ్‌ ఈవెంట్‌లో స్వప్నిల్, చెయిన్‌ సింగ్, నీరజ్‌ లతో కూడిన భారత జట్టు బంగారు పతకాన్ని సొంతం చేసుకోగా... పురుషుల 25 మీటర్ల ర్యాపిడ్‌ ఫైర్‌ పిస్టల్‌ విభాగంలో విజయ్‌వీర్‌కు రజతం దక్కింది. ప్రస్తుతం భారత్‌ 12 స్వర్ణాలు, 7 రజతాలు, 6 కాంస్యాలతో కలిపి మొత్తం 25 పతకాలతో అగ్రస్థానంలో ఉంది.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement