IND Vs BAN: రాణించిన పుజారా, శ్రేయస్.. 404 పరుగులకు భారత్ ఆలౌట్
Published
Thu, Dec 15 2022 1:07 PM
ఛాటోగ్రామ్ వేదికగా బంగ్లాదేశ్తో తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్లో భారత్ 404 పరుగులకు ఆలౌటైంది. 278 పరుగులతో రెండో రోజు ఆటను ప్రారంభించిన టీమిండియా అదనంగా మరో 126 పరుగులు చేసి ఇన్నింగ్స్ను ముగించింది. భారత బ్యాటర్లలో ఛతేశ్వర్ పుజారా(90), శ్రేయస్ అయ్యర్(86), అశ్విన్(58) పరుగులతో రాణించారు.
ఆఖరిలో కుల్దీప్ యాదవ్(40) కూడా కీలక ఇన్నింగ్స్ ఆడాడు. కాగా ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో టీమిండియా స్టాండింగ్ కెప్టెన్ కేఎల్ రాహుల్(22), శుబ్మాన్ గిల్(20), విరాట్ కోహ్లి(1) తీవ్ర నిరాశపరిచారు.