
భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా
ఒ్రస్టావా (చెక్ రిపబ్లిక్): భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా ఈ సీజన్లో తన ప్రధాన లక్ష్యం ప్రపంచ చాంపియన్షిప్ టైటిలే అని స్పష్టం చేశాడు. చోప్రా తను ఆశించిన 90 మీటర్ల మార్క్తో కాకపోయినా... పారిస్ డైమండ్ లీగ్లో 88.16 మీటర్ల దూరంలో ఈటెను విసిరి అగ్రస్థానంలో నిలిచాడు. తాజాగా ఇక్కడ జరిగే ‘గోల్డెన్ స్పైక్ అథ్లెటిక్స్ మీట్’లో పాల్గొనేందుకు వచ్చిన భారత స్టార్ మరో విజయంపై కన్నేశాడు.
రెండు ఒలింపిక్ పతకాల విజేత అయిన నీరజ్ తన ప్రదర్శనకు చెక్ రిపబ్లిక్ గ్రేట్ జాన్ జెలెజ్నీ కోచింగ్ ఎంతో దోహదం చేసిందని అన్నాడు. అతని శిక్షణలోనే రాటుదేలిన 27 ఏళ్ల భారత స్టార్ ఈ సీజన్లో జరిగిన ప్రారంభ దోహా డైమండ్ లీగ్లో తొలిసారిగా 90 మీటర్ల మార్క్ను అందుకున్నాడు. ఈ నేపథ్యంలో చోప్రా మాట్లాడుతూ ‘మేటి అథ్లెట్, కోచ్ అయిన జెలెజీ్నతో కలిసి పనిచేయడం చాలా సంతోషానిస్తోంది.
ఆయన ఇచ్చిన సూచనలు, కిటుకులతోనే ఈ ఏడాది 90 మీటర్ల మార్క్ను దాటేశాను. దీన్ని పునరావృతం చేయడంపై దృష్టిసారించాను. ఇక్కడి నైంబర్క్లో అహ్లాదకర వాతావరణంలో ట్రెయినింగ్ సెషన్ పూర్తిచేశాను. తప్పకుండా ఒ్రస్టావాలో నా శక్తి మేర రాణిస్తాను. అయితే నా ప్రధాన లక్ష్యం మాత్రం టోక్యోలో జరిగే ప్రపంచ చాంపియన్షిప్లో నెగ్గడమే. ఇందుకోసమే క్రమం తప్పకుండా చెమటోడ్చుతున్నాను. తీరిక లేకుండా ఇటు ట్రెయినింగ్ సెషన్స్, అటు డైమండ్ లీగ్లలో పోటీపడుతున్నా’ అని అన్నాడు.
ఈ సెప్టెంబర్ 13 నుంచి 21 వరకు టోక్యోలో ప్రపంచ అథ్లెటిక్ చాంపియన్షిప్ పోటీలు జరుగనున్నాయి. టోక్యో ఒలింపిక్స్లోనే స్వర్ణం గెలుపొందిన తొలి భారతీయ అథ్లెట్ అక్కడ మరో పతకాన్ని ఆశిస్తున్నాడు. ప్రస్తుతం ఒ్రస్టావా మీట్కు రావడం చాలా ఆనందంగా ఉందని చోప్రా అన్నాడు. ఒకప్పుడు ఇక్కడ జరిగే పోటీల్లో గ్రేటెస్ట్ స్ప్రింటర్ ఉసేన్ బోల్ట్ పోటీని టీవీల్లో చూసి మురిసేవాడినని ఇప్పుడు అదే వేదికపై తాను పోటీ పడుతున్నానని చెప్పుకొచ్చాడు. మంగళవారం ఒస్ట్రావా గోల్డెన్ స్పైక్ మీట్ జరుగుతుంది.