ప్రాగ్‌ మాస్టర్స్‌ చెస్‌ టోర్నీ విజేత హరికృష్ణ | Harikrishna score crucial wins In Pragu open Masters Tournment | Sakshi
Sakshi News home page

ప్రాగ్‌ మాస్టర్స్‌ చెస్‌ టోర్నీ విజేత హరికృష్ణ

Jun 19 2022 10:13 AM | Updated on Jun 19 2022 10:13 AM

Harikrishna score crucial wins In Pragu open Masters Tournment - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: భారత గ్రాండ్‌మాస్టర్, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన పెంటేల హరికృష్ణ చెక్‌ రిపబ్లిక్‌లో జరిగిన ప్రాగ్‌ ఓపెన్‌ మాస్టర్స్‌ టోర్నమెంట్‌లో విజేతగా నిలిచాడు. 10 మంది మేటి గ్రాండ్‌మాస్టర్ల మధ్య తొమ్మిది రౌండ్లపాటు రౌండ్‌ రాబిన్‌ లీగ్‌ పద్ధతిలో జరిగిన ఈ టోర్నీలో 36 ఏళ్ల హరికృష్ణ 6.5 పాయింట్లతో టాప్‌ ర్యాంక్‌లో నిలిచాడు.

డేవిడ్‌ ఆంటోన్‌ గిజారో (స్పెయిన్‌)తో జరిగిన చివరిదైన తొమ్మిదో రౌండ్‌ గేమ్‌లో హరికృష్ణ 57 ఎత్తుల్లో గెలిచి టైటిల్‌ను ఖరారు చేసుకున్నాడు. ఈ టోర్నీలో హరికృష్ణ నాలుగు గేముల్లో గెలిచి, ఐదు గేమ్‌లను ‘డ్రా’ చేసుకొని అజేయంగా నిలిచాడు. విజేతగా నిలిచిన హరికృష్ణకు 25 వేల చెక్‌ కొరూనాలు (రూ. 82 వేలు) ప్రైజ్‌మనీగా లభించాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement