గంభీర గర్జన.. కేకేఆర్పై గెలుపు అనంతరం లక్నో మెంటార్ ఉద్వేగం
నరాలు తెగే ఉత్కంఠ నడుమ నిన్న (మే 18) కేకేఆర్తో జరిగిన రసవత్తర సమరంలో లక్నో సూపర్ జెయింట్స్ విజయం సాధించిన విషయం తెలిసిందే. చివరి బంతి వరకు నువ్వా నేనా అన్నట్లు సాగిన ఈ పోరులో లక్నో 2 పరుగుల స్వల్ప తేడాతో బయటపడింది. ఫలితంగా కేకేఆర్ ఇంటికి, లక్నో ప్లే ఆఫ్స్కు చేరాయి.
And the Roar comes out…look at this…he’s a live wire…he’s pumped up…this is cricket for this man…same aggression on and off the field…Helluva game…what a finish..!!!! @GautamGambhir #LSG #LSGvKKR pic.twitter.com/yolCNFsrPp
— Aditya Yellanki (@adityayellanki) May 18, 2022
మ్యాచ్ ఆఖరి బంతికి 3 పరుగులు చేయాల్సిన సమయంలో స్టోయినిస్..ఉమేశ్ యాదవ్ను క్లీన్ బౌల్డ్ చేసి లక్నో విజయాన్ని ఖరారు చేశాడు. ఈ సందర్భంగా లక్నో డగౌట్లో ఓ ఆసక్తికర సన్నివేశం తారసపడింది. అప్పటివరకు టెన్షన్ తట్టుకోలేక కళ్లు మూసుకుని డగౌట్లో కూర్చున్న లక్నో మెంటార్ జట్టు విజయం సాధించగానే తీవ్రమైన ఉద్వేగానికి లోనయ్యాడు. గట్టిగా గర్జిస్తూ, గాల్లోకి పంచ్లు విసురుతూ తన ఆనందాన్ని సహచరులతో పంచుకున్నాడు. గంభీర గర్జనకు సంబంధించిన ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరలవుతుంది.
కాగా, లక్నో-కేకేఆర్ జట్ల మధ్య నిన్న జరిగిన మ్యాచ్ చాలాకాలం తర్వాత ప్రేక్షకులకు అసలుసిసలైన ఐపీఎల్ మజాను అందించింది. ఈ మ్యాచ్ చివరి ఓవర్లో కేకేఆర్ విజయానికి 21 పరుగులు అవసరం కాగా.. స్టోయినిస్ బౌలింగ్లో రింకూ సింగ్ వరుసగా 4, 6, 6, 2 పరుగులు చేసి మ్యాచ్ను కేకేఆర్వైపు తిప్పాడు. ఇక కేకేఆర్ గెలుపు లాంఛనమే (2 బంతుల్లో 3 పరుగులు) అనుకుంటున్న తరుణంలో స్టోయినిస్ విజృంభించి చివరి రెండు బంతులకు రెండు వికెట్లు తీసి కేకేఆర్ పుట్టిముంచాడు.
చదవండి: IPL 2022: కోల్‘కథ’ ముగిసింది
మరిన్ని వార్తలు