రజతం నెగ్గిన భారత రెజ్లర్‌ రూపిన్‌.. తొలి రోజు భారత్‌కు మూడు పతకాలు

Asian Wrestling Championship 2023: India Won 3 Medals Opening Day - Sakshi

కజకిస్తాన్‌లో జరుగుతున్న ఆసియా సీనియర్‌ రెజ్లింగ్‌ చాంపియన్‌షిప్‌లో తొలి రోజు భారత్‌కు మూడు పతకాలు లభించాయి. పురుషుల గ్రీకో రోమన్‌ విభాగంలో రూపిన్‌ (55 కేజీలు) రజతం... నీరజ్‌ (63 కేజీలు), సునీల్‌ (87 కేజీలు) కాంస్య పతకాలు సాధించారు.

ఫైనల్లో రూపిన్‌ 1–3తో సౌలత్‌ (ఇరాన్‌) చేతిలో ఓడిపోగా... నీరజ్‌ 5–2తో జిన్‌సెయుబ్‌ సాంగ్‌ (దక్షిణ కొరియా)పై, సునీల్‌ 4–1తో మసాటో సుమి (జపాన్‌)పై గెలిచారు.  
చదవండి: #KavyaMaran: 'చల్‌ హట్‌ రే'.. నీకు నేనే దొరికానా! 
రషీద్‌ ఖాన్‌ ప్రపంచ రికార్డు.. ఎవరికీ సాధ్యం కాలేదు! వీడియో వైరల్‌

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top